వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్న మహేష్
- June 02, 2016
'ఊపిరి' సినిమాతో లేటెస్ట్ గా హిట్ కొట్టిన వంశీ పైడిపల్లి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడు. రొమాంటిక్ థ్రిల్లర్ గా భావిస్తున్న ఈ సినిమాను తమిళ తెలుగు భాషల్లో తెరకెక్కించబోతున్నారు. వంశీ చెప్పిన కథ విని మహేష్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. జూన్ మొదటి వారంలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తారు.
ప్రస్తుతం వంశీ అమెరికాలో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తుండగా, మహేష్ లండన్ లో ఫ్యామిలీ టూర్ లో ఉన్నాడు. వీళ్లిద్దరూ వచ్చాక మూవీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మహేష్ ఇండియాకు వచ్చిన వెంటనే మురుగదాస్ మూవీ షూటింగ్ తో బిజికానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది.
ఇక తాజాగా వంశీ పైడిపల్లితో చేయబోయే సినిమా కూడా ద్విభాషా చిత్రంగా తెరకెక్కబోవడం విశేషం. మొత్తానికి తమిళమార్కెట్ పై మహేష్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టే కనిపిస్తోంది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









