వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్న మహేష్
- June 02, 2016
'ఊపిరి' సినిమాతో లేటెస్ట్ గా హిట్ కొట్టిన వంశీ పైడిపల్లి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడు. రొమాంటిక్ థ్రిల్లర్ గా భావిస్తున్న ఈ సినిమాను తమిళ తెలుగు భాషల్లో తెరకెక్కించబోతున్నారు. వంశీ చెప్పిన కథ విని మహేష్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. జూన్ మొదటి వారంలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తారు.
ప్రస్తుతం వంశీ అమెరికాలో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తుండగా, మహేష్ లండన్ లో ఫ్యామిలీ టూర్ లో ఉన్నాడు. వీళ్లిద్దరూ వచ్చాక మూవీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మహేష్ ఇండియాకు వచ్చిన వెంటనే మురుగదాస్ మూవీ షూటింగ్ తో బిజికానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది.
ఇక తాజాగా వంశీ పైడిపల్లితో చేయబోయే సినిమా కూడా ద్విభాషా చిత్రంగా తెరకెక్కబోవడం విశేషం. మొత్తానికి తమిళమార్కెట్ పై మహేష్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టే కనిపిస్తోంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









