వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్న మహేష్
- June 02, 2016
'ఊపిరి' సినిమాతో లేటెస్ట్ గా హిట్ కొట్టిన వంశీ పైడిపల్లి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడు. రొమాంటిక్ థ్రిల్లర్ గా భావిస్తున్న ఈ సినిమాను తమిళ తెలుగు భాషల్లో తెరకెక్కించబోతున్నారు. వంశీ చెప్పిన కథ విని మహేష్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. జూన్ మొదటి వారంలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తారు.
ప్రస్తుతం వంశీ అమెరికాలో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తుండగా, మహేష్ లండన్ లో ఫ్యామిలీ టూర్ లో ఉన్నాడు. వీళ్లిద్దరూ వచ్చాక మూవీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మహేష్ ఇండియాకు వచ్చిన వెంటనే మురుగదాస్ మూవీ షూటింగ్ తో బిజికానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది.
ఇక తాజాగా వంశీ పైడిపల్లితో చేయబోయే సినిమా కూడా ద్విభాషా చిత్రంగా తెరకెక్కబోవడం విశేషం. మొత్తానికి తమిళమార్కెట్ పై మహేష్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టే కనిపిస్తోంది.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







