వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్న మహేష్
- June 02, 2016
'ఊపిరి' సినిమాతో లేటెస్ట్ గా హిట్ కొట్టిన వంశీ పైడిపల్లి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడు. రొమాంటిక్ థ్రిల్లర్ గా భావిస్తున్న ఈ సినిమాను తమిళ తెలుగు భాషల్లో తెరకెక్కించబోతున్నారు. వంశీ చెప్పిన కథ విని మహేష్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. జూన్ మొదటి వారంలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తారు.
ప్రస్తుతం వంశీ అమెరికాలో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తుండగా, మహేష్ లండన్ లో ఫ్యామిలీ టూర్ లో ఉన్నాడు. వీళ్లిద్దరూ వచ్చాక మూవీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మహేష్ ఇండియాకు వచ్చిన వెంటనే మురుగదాస్ మూవీ షూటింగ్ తో బిజికానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది.
ఇక తాజాగా వంశీ పైడిపల్లితో చేయబోయే సినిమా కూడా ద్విభాషా చిత్రంగా తెరకెక్కబోవడం విశేషం. మొత్తానికి తమిళమార్కెట్ పై మహేష్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టే కనిపిస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







