రికార్డుల్లోకి ఎక్కిన విశాఖ విమానాశ్రయం
- June 29, 2015
విశాఖ విమానాశ్రయం అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో ఎయిర్పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా ప్రశంసలందుకునే స్ధితికి చేరింది. తాజాగా మిలియన్ ట్రేడ్ మార్క్ని అధిగమించి శభాష్ అనిపించుకుంది. ఈవిమానాశ్రయంలో ఎయిరిండియా, ఎయిర్ఆసియా, ఎయిర్కోస్తా, మలిందో, సిల్క్ ఎయిర్వేస్, ఇండిగో, స్పైస్ జెట్ విమానాలు దేశీయ అంతర్జాతీయ విమానసర్వీసులు అందిస్తున్నాయి. హైదరాబాదు, తిరుపతి, విజయవాడ, చెన్నై, కోల్కతా, ముంబయ్, బెంగుళూరు, ఢిల్లీ వంటి విమానాశ్రయాలతో పాటు దుబాయ్, కౌలాలంపూర్, సింగపూర్, పోర్టుబ్లెయిర్లకూ విమాన సర్వీసులు ఊపందుకున్నాయి. 2012-13 సంవత్సరంలో తొలి సారి ప్రయాణికుల సంఖ్య మిలియన్మార్కుకు చేరుకుంది. రాష్ట్ర విభజన ఉద్యమాలు, సమ్మెలు, హుద్ హుద్ తుపాను ప్రభావం బాగా చూపింది. తర్వాత రాష్ట్రం రెండుగా చీలిన తరుణంలో 2014-15 లో ప్రయాణికుల రద్దీ ఎలా వుంటుందోనని అధికారులు ఆలోచనలోపడ్డారు. అయితే దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు పెరగడంతో అధికారులు ఊహించనంతగా రద్దీ పెరిగింది. తాజాగా ఈసంఖ్య 11 లక్షల ప్రయాణికులను అధిగమించినట్లు రికార్డులు చెబుతున్నాయి. వినోద్కుమార్శర్మ విశాఖ విమానాశ్రయం డెరైక్టర్ విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు రావడానికి అవకాశాలున్నాయని అన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







