యు.ఏ.ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ వినియోగదారులకు వైరస్ ప్రమాదం

- June 30, 2015 , by Maagulf
యు.ఏ.ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ వినియోగదారులకు వైరస్ ప్రమాదం

'డైర్' పేరుగల అత్యాధునిక కంప్యూటర్ వైరస్, యు.ఎ. ఈ. లోని బాంకు వినియోగదారులు అతి తరచుగా ఉపయోగించే మూడు వెబ్ బ్రౌజర్లు - గూగల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్ మరియు ఇంటర్నెట్ ఎక్స్ ఎక్స్ ప్లోరార్ లను లక్ష్యంగా చేసుకొని, వారి ఆర్ధిక సంబంధిత సమాచారాన్ని సంగ్రహిస్తూ, అతి ప్రమాదకరంగా పరిణమించిందని అమెరికన్ టెక్నాలజీ కంపనీ – ‘సైమాంటెక్’ యొక్క సైబర్ సేక్యూరిటీ నిపుణుడు  తెలిపారు. ఇది ఇంతవరకు ప్రపంచ వ్యాప్తంగా 1000 కి పైగా బ్యాంకులు మరియు కంపెనీలకు హానిచేసిందని, ముఖ్యంగా బ్రిటిష్ మరియు అమెరికన్ సంస్థలపై కేంద్రీకృతమైనప్పటికీ, గత సంవత్సరం యు.ఎ. ఈ.  బాంకులపై కూడా దాడికి పాల్పడి సుమారు 400 మంది స్థానిక ఖాతాదారులను ఇబ్బందులకు గురిచేసిందని ఆయన తెలియ చేశారు.


--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com