‘భీమా’ బ్రహ్మరాక్షసుడుగా గోపీచంద్.! మాస్ పల్స్ పట్టేస్తాడా.?
- February 23, 2024
గోపీచంద్కి ఈ మధ్య పెద్దగా కలిసి రావడం లేదు. వరుస పెట్టి సినిమాలు చేస్తూనే వున్నాడు. ‘పక్కా కమర్షియల్’ అంటూ ఆ మధ్య కమర్షియల్ ఎంటర్టైనర్తో వచ్చాడు కానీ పాపం వర్కవుట్ కాలేదు.
తాజాగా ‘భీమా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రచార చిత్రాలు మాస్ ఆడియన్స్ని ఎట్రాక్ట్ చేసేలానే వున్నాయ్.
హీరోయిన్స్ గ్లామర్ డోస్ కూడా ఎక్కువే వుంది. రేపు విడుదల కాబోయే ట్రైలర్ని బట్టి ఇంకాస్త ఐడియా వస్తుంది. ఇప్పటికైతే.. ‘భీమా’కి పాజిటివ్ సైనే వుంది.
మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి సినిమాల్లో ‘హనుమాన్’ తర్వాత వచ్చిన సినిమాలేమీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు.
కొన్నిసినిమాలైతే చెప్పుకోదగ్గ లిస్టులోనే లేవు. సో, సినీ ప్రియులకి ఐఫీస్ మూవీ ఒకటి ఖచ్చితంగా పడాలి. అది ‘భీమా’ అయ్యిందంటే గోపీచంద్ లక్కు తోక తొక్కినట్లే.
రాధా మోహన్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయమవుతున్నాడు. మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!
- విదేశాలలో చిక్కుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!!
- ఆ రెండు కేసుల్లోనే అబార్షన్..షురా కౌన్సిల్ ఆమోదం..!!









