‘భీమా’ బ్రహ్మరాక్షసుడుగా గోపీచంద్.! మాస్ పల్స్ పట్టేస్తాడా.?
- February 23, 2024
గోపీచంద్కి ఈ మధ్య పెద్దగా కలిసి రావడం లేదు. వరుస పెట్టి సినిమాలు చేస్తూనే వున్నాడు. ‘పక్కా కమర్షియల్’ అంటూ ఆ మధ్య కమర్షియల్ ఎంటర్టైనర్తో వచ్చాడు కానీ పాపం వర్కవుట్ కాలేదు.
తాజాగా ‘భీమా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రచార చిత్రాలు మాస్ ఆడియన్స్ని ఎట్రాక్ట్ చేసేలానే వున్నాయ్.
హీరోయిన్స్ గ్లామర్ డోస్ కూడా ఎక్కువే వుంది. రేపు విడుదల కాబోయే ట్రైలర్ని బట్టి ఇంకాస్త ఐడియా వస్తుంది. ఇప్పటికైతే.. ‘భీమా’కి పాజిటివ్ సైనే వుంది.
మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి సినిమాల్లో ‘హనుమాన్’ తర్వాత వచ్చిన సినిమాలేమీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు.
కొన్నిసినిమాలైతే చెప్పుకోదగ్గ లిస్టులోనే లేవు. సో, సినీ ప్రియులకి ఐఫీస్ మూవీ ఒకటి ఖచ్చితంగా పడాలి. అది ‘భీమా’ అయ్యిందంటే గోపీచంద్ లక్కు తోక తొక్కినట్లే.
రాధా మోహన్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయమవుతున్నాడు. మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







