అండర్ టన్నెల్ మెట్రో..ప్రారంభించిన ప్రధాని మోదీ
- March 06, 2024
కోల్కతా: భారతదేశంలో తొలి అండర్ టన్నెల్ మెట్రో అందుబాటులోకి వచ్చింది. కోల్కతాలో నిర్మించిన ఈ అండర్ టన్నెల్ మెట్రోను ప్రధాని మోడీ ప్రారంభించారు.
జెండా ఊపి మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోడీ.. టన్నెల్ నిర్మాణం గురించి మెట్రో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెట్రోలో స్కూల్ విద్యార్థులతో కలిసి ప్రయాణించారు ప్రధాని. విద్యార్థులతో ముచ్చటిస్తూ సరదాగా గడిపారు.
కోల్కతా ఈస్ట్- వెస్ట్ మెట్రో కారిడార్ కింద దాదాపు 120 కోట్ల రూపాయల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది కింద నిర్మించారు. ఈ అండర్ టన్నెల్ మెట్రో మార్గం పొడవు 16.6 కిలోమీటర్లు కాగా.. 10.8 కిలోమీటర్ల భూగర్భంలో ఉంటుంది. ఈ ప్రాజెక్టులో హావ్డా మైదాన్ నుంచి ఎస్ప్లెనెడ్ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఉన్న లైనులో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్వాటర్ మెట్రో టన్నెల్ నిర్మించారు. నదిలోని ఈ దూరాన్ని మెట్రో రైలు 45 సెకన్లలో దాటనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









