అండర్ టన్నెల్ మెట్రో..ప్రారంభించిన ప్రధాని మోదీ
- March 06, 2024
కోల్కతా: భారతదేశంలో తొలి అండర్ టన్నెల్ మెట్రో అందుబాటులోకి వచ్చింది. కోల్కతాలో నిర్మించిన ఈ అండర్ టన్నెల్ మెట్రోను ప్రధాని మోడీ ప్రారంభించారు.
జెండా ఊపి మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోడీ.. టన్నెల్ నిర్మాణం గురించి మెట్రో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెట్రోలో స్కూల్ విద్యార్థులతో కలిసి ప్రయాణించారు ప్రధాని. విద్యార్థులతో ముచ్చటిస్తూ సరదాగా గడిపారు.
కోల్కతా ఈస్ట్- వెస్ట్ మెట్రో కారిడార్ కింద దాదాపు 120 కోట్ల రూపాయల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది కింద నిర్మించారు. ఈ అండర్ టన్నెల్ మెట్రో మార్గం పొడవు 16.6 కిలోమీటర్లు కాగా.. 10.8 కిలోమీటర్ల భూగర్భంలో ఉంటుంది. ఈ ప్రాజెక్టులో హావ్డా మైదాన్ నుంచి ఎస్ప్లెనెడ్ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఉన్న లైనులో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్వాటర్ మెట్రో టన్నెల్ నిర్మించారు. నదిలోని ఈ దూరాన్ని మెట్రో రైలు 45 సెకన్లలో దాటనుంది.
తాజా వార్తలు
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!









