గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలి: టిపిసిసి ఎన్నారై కన్వీనర్

- March 06, 2024 , by Maagulf
గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలి: టిపిసిసి ఎన్నారై కన్వీనర్

తెలంగాణ: టిపిసిసి ఎన్నారై కన్వీనర్ షేక్ చాంద్ పాషా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుకు జగిత్యాల్ మెడికల్ కాలేజ్ గెస్ట్ హౌస్లో కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది.

గల్ఫ్ బోర్డ్ వెంటనే ఏర్పాటు చేయాలని వారికి గల్ఫ్ సమస్యలు చాలా ఉన్నాయని గత 20 ఏళ్లుగా గల్ఫ్ కార్మికులను ఆదుకుంటామని రకరకాల నాయకులకు వినేసుకున్న గత ప్రభుత్వం వైపల్యం వల్ల గల్ఫ్ కుటుంబాలకు అన్యాయం జరిగింది.

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గల్ఫ్ ఆదుకుంటామని గల్ఫ్ పూర్తి చేస్తామని టీ.జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో మేనిఫెస్టో పొందుపరచడం జరిగింది.

వెంటనే నకిలీ ఏజెంట్ల పట్టాలని అలాగే పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేయాలని నకిలీ ఏజెంట్ల పై ఉక్కు పాదం మోపుతూ ఎన్నారై కోర్ట్, పోలీస్, కమిషన్, హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటు చేస్తూ గల్ఫ్ కు చెందిన ప్రతి కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం చేయాలని తిరిగి వచ్చిన వారికి ఉద్యోగం ఇచ్చి వారి వెంటనే ఆదుకోవాలని కోరారు.

--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి, తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com