ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- June 03, 2026
మనామా: ప్రాంతీయ భద్రతా ఉద్రిక్తతలు కొనసాగుతున్న దృష్ట్యా, బహ్రెయిన్ పౌరులు ఇరాన్ మరియు ఇరాక్లకు వెళ్లడంపై తాత్కాలిక నిషేధాన్ని విధించింది. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం మిడిలీస్టులో నెలకొన్న భద్రతా పరమైన ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. జాతీయ భద్రతను పరిరక్షించేందుకు, బహ్రెయిన్ పౌరుల భద్రతను నిర్ధారించే ప్రయత్నాలలో భాగంగానే ఈ చర్యను చేపట్టినట్లు తెలిపింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ ప్రయాణ నిషేధం అమలులో ఉంటుందని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







