ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- June 03, 2026
మనామా: ప్రాంతీయ భద్రతా ఉద్రిక్తతలు కొనసాగుతున్న దృష్ట్యా, బహ్రెయిన్ పౌరులు ఇరాన్ మరియు ఇరాక్లకు వెళ్లడంపై తాత్కాలిక నిషేధాన్ని విధించింది. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం మిడిలీస్టులో నెలకొన్న భద్రతా పరమైన ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. జాతీయ భద్రతను పరిరక్షించేందుకు, బహ్రెయిన్ పౌరుల భద్రతను నిర్ధారించే ప్రయత్నాలలో భాగంగానే ఈ చర్యను చేపట్టినట్లు తెలిపింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ ప్రయాణ నిషేధం అమలులో ఉంటుందని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం









