యూఏఈలో వరదలు.. రంగంలోకి రెస్క్యూ బృందాలు
- March 10, 2024
యూఏఈ: వారాంతంలో యూఏఈని భారీ వర్షాలు ప్రభావితం చేస్తున్నాయి. గత రాత్రి దేశంలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడి భారీ వర్షాలు కురిసాయి. మరోవైపు వర్షాల మప్పు కొనసాగుతుందని, అందరూ ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో ఈవెంట్లను రద్దు చేశారు. పార్కులను మూసివేశారు. ఇదిలా ఉండగా NCM దేశవ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా మెడికల్ ఫిట్నెస్ సెంటర్లను మూసివేస్తున్నట్లు షార్జా మునిసిపాలిటీ ప్రకటించింది. దుబాయ్లోని గ్రీన్ కమ్యూనిటీ మోటార్ సిటీలోని నివాసితులు తమ పరిస్థితిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తమ ప్రాంతంలో ఇంకా వరద తగ్గలేదని, నీటిని పంప్ చేయాల్సిన ట్యాంకర్లు ఇంకా రాలేదని ఆయా పోస్టుల్లో వెల్లడించారు. అత్యవసర పరిస్థితులకు ప్రతిస్పందించడానికి వివిధ సంస్థల నుండి మొత్తం 2,300 మంది సిబ్బందిని దుబాయ్ అధికారులు మోహరించారు. 250 ట్యాంకర్లు, 300 రెయిన్వాటర్ పంపులు, 180కి పైగా అత్యవసర వాహనాలు, ఫీల్డ్ సర్వే వాహనాలు, యంత్రాలు ఇతర భారీ పరికరాలతో సహా 700 యూనిట్లకు పైగా పరికరాలను బృందాలకు సహాయంగా ఉండనున్నాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!
- అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు
- కువైట్ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సముదాయం పై డ్రోన్ దాడి









