రవితేజ ఒప్పుకుంటే ఆ ప్రాజెక్ట్కి సై అంటోన్న నిర్మాత.!
- March 12, 2024
మాస్ రాజా రవితేజ, జేజమ్మ అనుష్క జంటగా తెరకెక్కిన చిత్రం ‘విక్రమార్కుడు’. ఇప్పుడు గ్లోబల్ డైరెక్టర్ అయిన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. అప్పట్లో ఓ సంచలనమే ఈ చిత్రం.
విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి కథ అందించారు. రాధా మోహన్ నిర్మించారు. అయితే ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రూపొందించాలనుకుంటున్నారట నిర్మాత రాధా మోహన్.
ఎప్పటి నుంచో ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట ఆయన. అందుకు కథ కూడా సిద్ధంగానే వుందట. కానీ, రాజమౌళి ప్లేస్లో సంపత్ నంది డైరెక్షన్ వహించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.
అయితే, ‘విక్రమార్కుడు 2’ని రవితేజతోనే తెరకెక్కించాలన్నది రాధా మోహన్ డ్రీమ్. అలాగే అనుష్క వుంటే బాగుండనుకుంటున్నారు. కానీ, ఇప్పుడు అనుష్క వున్న పరిస్థితుల్లో రవితేజ పక్కన హీరోయిన్గా ఊహించుకోలేం. అలాగే, సంపత్ నంది కూడా తన సినిమాలతో ప్రస్తుతం బిజీగా వున్నారు.
రవితేజను ఒప్పించడం కూడా ఏమంత సులువైన మార్గం కాదు. ఎందుకంటే, ఆయన ప్రస్తుతం కమిట్ అయిన ప్రాజెక్టులు అనేకం వున్నాయ్. ఇలా.. ఈ సినిమాని పట్టాలెక్కించేందుకు అనేక రకాల అడ్డంకులున్నాయ్.
కానీ, రాధా మోహన్ మాత్రం ఈ సినిమా టైటిల్ని రిజిస్టర్ చేయించి ఎప్పటికైనా రవితేజతోనే పట్టాలెక్కించాలన్న పట్టుదలతో వున్నారట. చూడాలి మరి, ఏం జరుగుతుందో.!
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







