రవితేజ ఒప్పుకుంటే ఆ ప్రాజెక్ట్కి సై అంటోన్న నిర్మాత.!
- March 12, 2024మాస్ రాజా రవితేజ, జేజమ్మ అనుష్క జంటగా తెరకెక్కిన చిత్రం ‘విక్రమార్కుడు’. ఇప్పుడు గ్లోబల్ డైరెక్టర్ అయిన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. అప్పట్లో ఓ సంచలనమే ఈ చిత్రం.
విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి కథ అందించారు. రాధా మోహన్ నిర్మించారు. అయితే ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రూపొందించాలనుకుంటున్నారట నిర్మాత రాధా మోహన్.
ఎప్పటి నుంచో ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట ఆయన. అందుకు కథ కూడా సిద్ధంగానే వుందట. కానీ, రాజమౌళి ప్లేస్లో సంపత్ నంది డైరెక్షన్ వహించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.
అయితే, ‘విక్రమార్కుడు 2’ని రవితేజతోనే తెరకెక్కించాలన్నది రాధా మోహన్ డ్రీమ్. అలాగే అనుష్క వుంటే బాగుండనుకుంటున్నారు. కానీ, ఇప్పుడు అనుష్క వున్న పరిస్థితుల్లో రవితేజ పక్కన హీరోయిన్గా ఊహించుకోలేం. అలాగే, సంపత్ నంది కూడా తన సినిమాలతో ప్రస్తుతం బిజీగా వున్నారు.
రవితేజను ఒప్పించడం కూడా ఏమంత సులువైన మార్గం కాదు. ఎందుకంటే, ఆయన ప్రస్తుతం కమిట్ అయిన ప్రాజెక్టులు అనేకం వున్నాయ్. ఇలా.. ఈ సినిమాని పట్టాలెక్కించేందుకు అనేక రకాల అడ్డంకులున్నాయ్.
కానీ, రాధా మోహన్ మాత్రం ఈ సినిమా టైటిల్ని రిజిస్టర్ చేయించి ఎప్పటికైనా రవితేజతోనే పట్టాలెక్కించాలన్న పట్టుదలతో వున్నారట. చూడాలి మరి, ఏం జరుగుతుందో.!
తాజా వార్తలు
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?