అధ్యక్ష పోటీకి జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వాల ఖరారు
- March 13, 2024
అమెరికా: ఈ ఏడాది నవంబర్లో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈసారి కూడా అధ్యక్ష పీఠం కోసం జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ పోటీ పడనున్నారు. కేవలం అధికారిక ప్రకటన మాత్రమే మిగిలింది. తాజాగా జార్జియా ప్రైమరీ ఎన్నికల్లో బైడెన్ గెలుపొంది డెమోక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్నారు. పార్టీ నుంచి నామినేట్ కావడానికి అవసరమైన 1,968 మంది ప్రతినిధులను జో బైడెన్ పొందారు. అటు వాషింగ్టన్, మిస్సిసిపీ, నార్తర్న్ మరియానా, ఐలాండ్స్లోనూ ఆయన విజయఢంకా మోగించడం ఖాయమని పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి.
ఇక జార్జియాలో విక్టరీ తర్వాత తన మద్దతుదారులను ఉద్దేశించి బైడెన్ ప్రసంగించారు. “ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఇప్పుడు ఓటర్ల చేతిలో ఉంది. ధైర్యంగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడతారా? లేదా దాన్ని కూల్చివేసేందుకు ఇతరులకు అనుమతి ఇస్తారా? మన భద్రతను, స్వేచ్ఛను కాపాడుకునే హక్కును పునరుద్ధరిస్తారా? లేదా వాటిని దూరం చేసేవారికి అవకాశం ఇస్తారా?” అని బైడెన్ అన్నారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









