అధ్యక్ష పోటీకి జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వాల ఖరారు
- March 13, 2024
అమెరికా: ఈ ఏడాది నవంబర్లో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈసారి కూడా అధ్యక్ష పీఠం కోసం జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ పోటీ పడనున్నారు. కేవలం అధికారిక ప్రకటన మాత్రమే మిగిలింది. తాజాగా జార్జియా ప్రైమరీ ఎన్నికల్లో బైడెన్ గెలుపొంది డెమోక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్నారు. పార్టీ నుంచి నామినేట్ కావడానికి అవసరమైన 1,968 మంది ప్రతినిధులను జో బైడెన్ పొందారు. అటు వాషింగ్టన్, మిస్సిసిపీ, నార్తర్న్ మరియానా, ఐలాండ్స్లోనూ ఆయన విజయఢంకా మోగించడం ఖాయమని పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి.
ఇక జార్జియాలో విక్టరీ తర్వాత తన మద్దతుదారులను ఉద్దేశించి బైడెన్ ప్రసంగించారు. “ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఇప్పుడు ఓటర్ల చేతిలో ఉంది. ధైర్యంగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడతారా? లేదా దాన్ని కూల్చివేసేందుకు ఇతరులకు అనుమతి ఇస్తారా? మన భద్రతను, స్వేచ్ఛను కాపాడుకునే హక్కును పునరుద్ధరిస్తారా? లేదా వాటిని దూరం చేసేవారికి అవకాశం ఇస్తారా?” అని బైడెన్ అన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







