అధ్యక్ష పోటీకి జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వాల ఖరారు
- March 13, 2024
అమెరికా: ఈ ఏడాది నవంబర్లో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈసారి కూడా అధ్యక్ష పీఠం కోసం జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ పోటీ పడనున్నారు. కేవలం అధికారిక ప్రకటన మాత్రమే మిగిలింది. తాజాగా జార్జియా ప్రైమరీ ఎన్నికల్లో బైడెన్ గెలుపొంది డెమోక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్నారు. పార్టీ నుంచి నామినేట్ కావడానికి అవసరమైన 1,968 మంది ప్రతినిధులను జో బైడెన్ పొందారు. అటు వాషింగ్టన్, మిస్సిసిపీ, నార్తర్న్ మరియానా, ఐలాండ్స్లోనూ ఆయన విజయఢంకా మోగించడం ఖాయమని పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి.
ఇక జార్జియాలో విక్టరీ తర్వాత తన మద్దతుదారులను ఉద్దేశించి బైడెన్ ప్రసంగించారు. “ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఇప్పుడు ఓటర్ల చేతిలో ఉంది. ధైర్యంగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడతారా? లేదా దాన్ని కూల్చివేసేందుకు ఇతరులకు అనుమతి ఇస్తారా? మన భద్రతను, స్వేచ్ఛను కాపాడుకునే హక్కును పునరుద్ధరిస్తారా? లేదా వాటిని దూరం చేసేవారికి అవకాశం ఇస్తారా?” అని బైడెన్ అన్నారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..







