16న అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం జగన్
- March 13, 2024
అమరావతి: సీఎం జగన్ ఈనెల 16న ఇడుపులపాయకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నారు. అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు సీఎం జగన్. అదే రోజు ఇచ్చాపురం కి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు వైఎస్ఆర్సిపి నేతలు, కార్యకర్తలు.
కాగా, రేపు కర్నూలు, నంద్యాల జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు లో నేషనల్ లా యూనివర్సిటీకి భూమి పూజ చేయనున్నారు సీఎం జగన్. అనంతరం నంద్యాల జిల్లా బనగానపల్లిలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల చేయనున్నారు సీఎం జగన్. రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకే వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..







