ప్రధాని మోదీని కలిసి కృతజ్ఞతలు తెలిపిన స్వామి బ్రహ్మవిహారిదాస్
- March 15, 2024
న్యూఢిల్లీ: BAPS స్వామినారాయణ్ సంస్థ తరపున స్వామి బ్రహ్మవిహారిదాస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సంధర్భంగా పవిత్ర మహంత్ స్వామి మహారాజ్ ప్రత్యేకంగా ఆశీర్వదించిన ఒక హారాన్ని ప్రధానమంత్రికి అందించారు. అబుదాబి BAPS హిందూ మందిర్ ప్రాజెక్ట్ ప్రారంభం నుండి పూర్తయ్యే వరకు దానిని పర్యవేక్షించినందుకు స్వామి బ్రహ్మవిహారిదాస్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మందిరానికి సంబంధించిన సంక్షిప్త నివేదికను అందించారు. యూఏఈ కమ్యూనిటీ మరియు ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన సందర్శకులు ఈ మందిర్ను చూసేందుకు వస్తున్నారని, మొదటి ఆదివారం 65,000 మంది సందర్శకులు వచ్చారని వివరించారు. మహా శివరాత్రి వంటి పండుగలను జరుపుకోవడానికి ఇది వేదికగా ఉందని, అటువంటి ఉత్సాహభరితమైన పండుగలు, ఆచారాలు మరియు సంప్రదాయాలను కొనసాగించాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని యూఏఈ పాలకుల విశాల హృదయం మరియు మద్దతు కోసం కృతజ్ఞతలు తెలియజేశారు.అబుదాబిలోని BAPS హిందూ మందిర్ను ఏర్పాటు చేయడం వెనుక ఉన్న స్వామీజీలు, వాలంటీర్లను ప్రధాన మంత్రి ప్రశంసించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష