'జస్టిస్ అండ్ డిగ్నిటీ కమిటీ ఆర్గనైజేషన్' కేసు ఏప్రిల్ 18కి వాయిదా
- March 16, 2024
యూఏఈ: అబుదాబి ఫెడరల్ అప్పీల్స్ కోర్ట్లోని స్టేట్ సెక్యూరిటీ ఛాంబర్ ఉగ్రవాద 'జస్టిస్ అండ్ డిగ్నిటీ కమిటీ ఆర్గనైజేషన్'కు సంబంధించిన కేసు విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. యూఏఈ 'జస్టిస్ అండ్ డిగ్నిటీ కమిటీ' అని పిలిచే రహస్య ఉగ్రవాద సంస్థను స్థాపించి, నిర్వహిస్తున్నారని ఈ కేసులో 84 మంది నిందితులుగా ఉన్నారు. న్యాయస్థానం మూడున్నర గంటలకు పైగా వాదనలు విన్నది. నిందితుల తరఫు న్యాయవాదులు ప్రాసిక్యూషన్ సమర్పించిన అభియోగాల చెల్లుబాటును సవాలు చేశారు. తమ క్లయింట్లను నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే, వారి వాదనలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ తిప్పికొట్టింది. నిందితులపై అన్ని సాక్ష్యాలు పక్కాగా ఉన్నాయని పేర్కొన్నది.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









