'జస్టిస్ అండ్ డిగ్నిటీ కమిటీ ఆర్గనైజేషన్' కేసు ఏప్రిల్ 18కి వాయిదా
- March 16, 2024
యూఏఈ: అబుదాబి ఫెడరల్ అప్పీల్స్ కోర్ట్లోని స్టేట్ సెక్యూరిటీ ఛాంబర్ ఉగ్రవాద 'జస్టిస్ అండ్ డిగ్నిటీ కమిటీ ఆర్గనైజేషన్'కు సంబంధించిన కేసు విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. యూఏఈ 'జస్టిస్ అండ్ డిగ్నిటీ కమిటీ' అని పిలిచే రహస్య ఉగ్రవాద సంస్థను స్థాపించి, నిర్వహిస్తున్నారని ఈ కేసులో 84 మంది నిందితులుగా ఉన్నారు. న్యాయస్థానం మూడున్నర గంటలకు పైగా వాదనలు విన్నది. నిందితుల తరఫు న్యాయవాదులు ప్రాసిక్యూషన్ సమర్పించిన అభియోగాల చెల్లుబాటును సవాలు చేశారు. తమ క్లయింట్లను నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే, వారి వాదనలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ తిప్పికొట్టింది. నిందితులపై అన్ని సాక్ష్యాలు పక్కాగా ఉన్నాయని పేర్కొన్నది.
తాజా వార్తలు
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!







