కుళ్ళిన మాంసం అమ్మకాలపై జరీమానా
- June 04, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్ (ఎంఇసి), వినియోగదారుల హక్కుల రక్షణ నేపథ్యంలో విస్తృతమైన ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. ఎంఇసి అధికారులు 134 బచర్ షాపుల్లో తనిఖీలు నిర్వహించి, అందులో 14 షాపులకు జరీమానా విధించింది. ఈ షాపుల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాల్ని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కుళ్ళిన మాంసం ఈ దుకాణాల్లో విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు. కన్స్యూమర్ ప్రొటెక్షన్ చట్టాన్ని ఉల్లంఘించినవారికి 3000 ఖతారీ రియాల్స్ నుంచి 1 మిలియన్ ఖతారీ రియాల్స్ వరకు జరీమానా విధించబడుతుంది. నిబంధనల ఉల్లంఘనపై వినియోగదారులు ఫిర్యాదులు చేయవచ్చునని అధికారులు సూచించారు. కాల్ సెంటర్ లేదా ఇ-మెయిల్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఐఫోన్ మరియు ఆండ్రాయిడ్ సర్వీసుల్లో ఎంఇసి అప్లికేషన్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







