రేపటి నుండి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- March 17, 2024
ఇటీవల వాతావరణంలో చాల మార్పులు వస్తున్నాయి. వర్ష కాలంలో ఎండలు , ఎండ కాలంలో వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజలకు ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు. ప్రస్తుతం పంటలు చేతికొచ్చే క్రమంలో ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది.
ఈ నెల 21 వరకు ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వానలు పడుతాయని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. మరోవైపు పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది.
తూర్పు విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ఇప్పుడు మరఠ్వాడా నుండి అంతర్గత కర్ణాటక మరియు తమిళనాడును దాటి కొమోరిన్ ప్రాంతం వరకు విస్తరించింది. దీని ఫలితంగా, మార్చి 20 వరకు మధ్య తెలంగాణ, కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే విధంగా జార్ఖండ్, ఒడిశా, విదర్భ, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్లు అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలపై దీని ప్రభావం ఉండనుంది.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









