TWA-Q ఆధ్వర్యంలో దోహాలో ‘కమ్యూనిటీ ఇఫ్తార్’
- March 19, 2024
దోహా: తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ - ఖతార్ (TWA-Q) దోహాలోని అబు హమూర్లోని ఐన్ ఖలేద్లోని ఉమ్ అల్ సెనీమ్ పార్క్ లో కమ్యూనిటీ ఇఫ్తార్ ని మార్చి 15వ తేదీన నిర్వహించింది. ముఖ్యఅతిథి ఖతార్లోని భారత రాయబారి హెచ్.ఇ. విపుల్ తోపాటు షానవాస్ బావ (ఐసిబిఎఫ్ అధ్యక్షుడు), దీపక్ శెట్టి (వైస్ ప్రెసిడెంట్ ఐసిబిఎఫ్), వర్కీ బోబన్ కె (జనరల్ సెక్రటరీ ఐసిబిఎఫ్), అబ్దుల్ రవూఫ్ కొండోయిట్టి (హెడ్ ఆఫ్ ICBF ఇన్సూరెన్స్ & కమ్యూనిటీ వెల్ఫేర్), సత్యనారాయణ మలిరెడ్డి (మేనేజింగ్ కమిటీ మెంబర్ ICC), ICBF అసోసియేటెడ్ ఆర్గనైజేషన్స్(AOs) ప్రతినిధులు, ఖతార్లోని ఇతర కమ్యూనిటీ నాయకులు పాల్గొన్నారు. TWA-Q ద్వారా అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను భారత రాయబారి ప్రశంసించారు. భవిష్యత్ లోనూ ఇదే వేగంతో ముందుకుపోవాలని అభినందించారు. TWA-Q ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్దుల్ రవూఫ్ మాట్లాడుతూ.. తెలంగాణా వెల్ఫేర్ అసోసియేషన్ - ఖతార్ (TWA-Q) ఈ పవిత్ర రమదాన్ మాసంలో ఖతార్లో ఉంటున్న తమ కమ్యూనిటీ సభ్యులను ఒకచోటకు చేర్చిందన్నారు. ఈ ఈవెంట్ను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలోనవీద్ దస్తగిర్, రమేష్ పిట్ల, మహమ్మద్ షోయబ్, మహమ్మద్ సలావుద్దీన్, నాగరాజు, సయ్యద్ బకర్, కృష్ణ, మిస్టర్ గులాం రసూల్, తాహా, నదీమ్, తల్హా, అమెర్, వసీమ్, ఫిరోజ్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)


తాజా వార్తలు
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!







