స్వల్ప తనిఖీలతో సులువుగా అమెరికా ప్రవేశించేందుకు ఒప్పందం

- June 04, 2016 , by Maagulf
స్వల్ప తనిఖీలతో  సులువుగా అమెరికా ప్రవేశించేందుకు  ఒప్పందం

 కొన్ని నిర్దేశిత విమానాశ్రయాల్లో స్వల్ప తనిఖీలతో భారతీయులు సులువుగా అమెరికాలో ప్రవేశించేందుకు ఇరు దేశాలూ అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి. పెద్దగా తనిఖీలు అవసరం లేని ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.ఇలాంటి వారికి భద్రతాపరమైన అనుమతులను త్వరగా మంజూరు చేస్తారు. ఇందుకోసం అమెరికాతో 'గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్' ఒప్పందం కుదుర్చుకున్న తొమ్మిదో దేశం భారత్ అని అమెరికా అధికారులు తెలిపారు. ఈ మేరకు అమెరికాలో భారత రాయబారి అరుణ్ సింగ్, అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ డిప్యూటీ కమిషనర్ మధ్య కెవిన్ మెక్ అలీనన్ మధ్య ఎంఓయూ కుదిరింది. ఈ కార్యక్రమం అమలుకు కొన్ని నెలల సమయం పడుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com