తాగుడు మాన్పిస్తే జనం పిచ్చివాళ్లవుతారు
- June 05, 2016
ఆయన కోడి కంటే ముందే మేల్కొంటారు. యోగా, ధ్యానం, స్నానం పూర్తిచేసి ఆరింటికల్లా ప్రభుత్వ అధికారుల గుండెల్లో నిద్రకు ఉపక్రమిస్తాంటారు. తిరిగి లేచేది రాత్రి 11 గంటలకు. నాలుగు దశాబ్ధాల తన 'రాజకీయ' ఫిట్ నెస్ కు క్రమశిక్షణ మొదటి కారణమైతే మద్యపానానికి దూరంగా ఉండటం రెండో కారణమని గతంలో పలుమార్లు పేర్కొన్నారు కూడా. ఆయన బాబుగారు. అందుకే ఇప్పుడు మాట మార్చారు. మద్యం సేవిస్తే మనుషులు సంతోషంగా ఉంటారని చెబుతున్నారు. మంతుకొట్టి పేకాట ఆడితే ఆ మజాయే వేరంటున్నారు. మందు ముట్టనని చెప్పుకునే చంద్రబాబు మద్యపానంలోని మజాను పూసగుచ్చినట్లు చెప్పడం.. అది కూడా డ్వాక్రామహిళల సమక్షంలో మాట్లాడటంతో ముఖ్యమంత్రిపై తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.నవనిర్మాణ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాల మహిళలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రి పూట ఓ పెగ్గు మద్యం తాగితే సంతోషంగా ఉంటారని, ఇంకా సంతోషంగా ఉండాలంటే పేకాట ఆడాలని మగవారికి సలహా ఇచ్చారు. తాగమన్నంత మాత్రాన పూటుగా తాగి భార్యాపిల్లలను కొట్టొద్దని హితవు పలికారు. మొత్తానికి 'మందు తాగండి బాబులూ..' అనే అర్థంలో ప్రభుత్వ ఆదాయాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేశారు. ( చదవండి: తాగుడు మాన్పిస్తే జనం పిచ్చివాళ్లవుతారు- చంద్రబాబు )సమావేశానికి హాజరైన మహిళలు.. మందుపై ముఖ్యమంత్రి చెప్పిన మాటలు విని అవాక్కయ్యారు. అసలే మద్యం బానిసలు పెరిగిపోతుండగా, దానిని అరికట్టాల్సిందిపోయి సీఎం స్థాయిలో ఇలా బహిరంగంగా మద్యపానాన్ని ప్రోత్సహించేలా మాట్లాడటం దారుణమని గుసగుసలాడుకున్నారు. బాబు వ్యాఖ్యలపై పలు మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మద్యపానాన్ని సమర్థిస్తూ శనివారం కూడ చంద్రబాబు వింత వ్యాఖ్యలు చేశారు. మద్యనిషేధం విధిస్తే జనం పిచ్చివాళ్లవుతారని వ్యాఖ్యానించారు. 24 గంటలు తిరిగిలోపే మళ్లీ మందుపై మరో మాట పేల్చారాయన.
తాజా వార్తలు
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్







