ఈడీ కస్టడీ నుంచే కేజ్రీవాల్ పాలన..
- March 24, 2024
న్యూ ఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈనెల 21న ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా ఢిల్లీతోసహా దేశంలోని పలు నగరాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు కొనసాగుతున్నాయి. కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసిన మరుసటి రోజే రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది. విచారణ అనంతరం ఈనెల 28వరకు ఆయన్ను ఈడీ కస్టడీకి పంపింది. అయితే, కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సుముఖంగా లేరు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుతానని తెలిపారు. అంతేకాక.. ఆపార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలుసైతం కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతాడని తెలిపారు.
ఈడీ అరెస్టును వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటీషన్ ను వెంటనే విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. కోర్టు కేజ్రీవాల్ పిటిషన్ ను మార్చి 27న విచారించనుంది. ఈ పిటీషన్ లో.. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. బెయిల్ పొందేందుకు చట్టపరంగా తనకు అర్హత ఉందని కేజ్రీవాల్ పిటీషన్ లో పేర్కొన్నాడు. ఇదిలాఉంటే.. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ సీఎంగా తన పాలనను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నుంచి జల మంత్రిత్వ శాఖకు సంబంధించిన తొలి ఉత్తర్వులు జారీ చేశారు. తన ఉత్తర్వులను జల మంత్రికి నోట్ ద్వారా జారీ చేశారు. ఢిల్లీ ప్రభుత్వంలో జల మంత్రిత్వ శాఖ అతిశి ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించవచ్చునని తెలుస్తోంది.
కేజ్రీవాల్ జైలు నుంచి పాలన సాగిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదా అనే చర్చ సాగుతోంది. ఆయన ఇంకా దోషిగా తేలనందున జైలు నుంచి పాలన చేసేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆప్ నేతలు చెబుతున్నారు. ఢిల్లీ మంత్రి అతిశీ మాట్లాడుతూ.. కేజ్రీవాల్ జైలు నుంచే పాలన సాగిస్తారని చెప్పారు. మరోవైపు రెండోరోజు కేజ్రీవాల్ ఈడీ కస్టడీ కొనసాగుతుంది. తొలిరోజు ఈడీ విచారణకు ఆయన సహకరించలేదని తెలుస్తోంది. సీసీ టీవీ పర్యవేక్షణలో కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తున్నారు. లిఖితపూర్వకంగా, మౌఖికంగా కే్జ్రీవాల్ ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









