రంగంలోకి దిగిన కేసీఆర్
- March 24, 2024
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని భావిస్తున్నారు. హైదరాబాద్ మినహా అభ్యర్థుల ఎంపికను పూర్తిచేసిన బీఆర్ఎస్ అధినేత ఉగాది తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు బహిరంగ సభలకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన కేసీఆర్ ఈసారి మాత్రం రోడ్షోలు, కార్నర్ మీటింగ్లలో పాల్గొనాలని నిర్ణయించినట్టు తెలిసింది. మొత్తం 17 నియోజకవర్గాలను చుట్టేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకోసం తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లడం ద్వారా ప్రజలకు దగ్గర కావడంతోపాటు క్యాడర్లోనూ ఆత్మస్థైర్యం నింపేందుకే కేసీఆర్ రోడ్షో నిర్ణయం తీసుకున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 17 లోక్సభ స్థానాలకు గాను 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ హైదరాబాద్ స్థానాన్ని పెండింగులో పెట్టారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీకాంత్ హైదరాబాద్ అభ్యర్థిగా దాదాపు ఖరారైనప్పటికీ అధికారికంగా ప్రకటించాల్సి ఉందని సమాచారం.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన