Dh4,000..రీ-ఎన్రోల్మెంట్ నోటీసు పై పేరెంట్స్ ఆందోళన
- March 25, 2024యూఏఈ: దుబాయ్లోని పాఠశాలలు రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లిదండ్రులకు నోటిఫికేషన్లను జారీ చేయడం ప్రారంభించాయి. కొన్ని పాఠశాలలు ఒక్కో చిన్నారికి తిరిగి రిజిస్ట్రేషన్ ఫీజుగా Dh4,000 వరకు వసూలు చేస్తున్నాయి. మరోవైపు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎమిరేట్స్ ఎడ్యుకేషనల్ రెగ్యులేటర్, నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (KHDA) ప్రకారం.. పాఠశాలలు తమ పిల్లలకు తదుపరి విద్యా సంవత్సరంలో చోటు కోసం హామీ ఇవ్వడానికి తిరిగి చెల్లించని రీ-రిజిస్ట్రేషన్ డిపాజిట్ చెల్లించమని తల్లిదండ్రులను కోరే అవకాశం ఉం. అయితే, ఈ డిపాజిట్ మొత్తం ట్యూషన్ ఫీజులో ఐదు శాతం లేదా Dh500 (ఏది ఎక్కువైతే అది) కంటే ఎక్కువ ఉండకూడదు. విద్యా సంవత్సరానికి సంబంధించిన మొత్తం ట్యూషన్ ఫీజు నుండి మినహాయించబడుతుంది.
GEMS ఎడ్యుకేషన్లోని సేల్స్ & ఎన్రోల్మెంట్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విక్టోరియా లంబీ మాట్లాడుతూ..తమ పిల్లలను పాఠశాలలో మళ్లీ నమోదు చేసి, కొత్తగా నమోదు చేయాలనే ఉద్దేశ్యాన్ని ముందస్తుగా నిర్ధారించడం తల్లిదండ్రులకు మనశ్శాంతిని అందించడమే కాకుండా, పాఠశాలలకు వారి తరగతి గది కేటాయింపులు, ప్రణాళికలు మరియు రాబోయే సంవత్సరానికి సన్నాహాల్లో సహాయపడుతుందని తెలిపారు. అయితే, ఒక కుటుంబం యూఏఈ నుండి బయలుదేరాలని నిర్ణయించుకుంటే.. పాఠశాలకు చేసిన ఏవైనా డిపాజిట్లు అవసరమైన సహాయక పత్రాలను సమర్పించిన తర్వాత తిరిగి చెల్లించబడతాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్..
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్