ఐపీఎల్ టికెట్ల పై సైబర్ మోసాలు..
- March 30, 2024
ఐపీఎల్ ట్రెండ్ నడుస్తోంది. ఐపీఎల్ మ్యాచ్లను లైవ్లో చూడాలని క్రికెట్ అభిమానులు తెగ ఆరాటపడుతుంటారు. ఐపీఎల్ నేరుగా చూసే ఛాన్స్ దొరికితే అసలు వదిలిపెట్టరు. అందులోనూ ఐపీఎల్ ఉప్పల్ స్టేడియంలో మన హైదరాబాద్ జట్టుతో మ్యాచ్ జరుగుతుందంటే.. టికెట్ బుక్ చేయకుండా ఉండలేరనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు.
ఇదే ఐపీఎల్ క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు సైబర్ నేరగాళ్లు మాటేసి ఉన్నారు జాగ్రత్త.. ముఖ్యంగా ఐపీఎల్ టికెట్ల కొనుగోలుపై కన్నేశారు. ఆన్లైన్లో ఐపీఎల్ టికెట్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. వచ్చే ఏప్రిల్ 5న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ సన్రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్ టికెట్లు అన్నీ క్లోజ్.. నిలిపివేసిన పేటీఎం:
ఇప్పటికే ఈ చెన్నై, హైదరాబాద్ మ్యాచ్కు సంబంధించిన టికెట్లు అన్ని అమ్ముడయ్యాయి కూడా. కానీ, సైబర్ నేరగాళ్లు ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఇప్పిస్తామంటూ సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడుతున్నారు. వాస్తవానికి, ఆన్లైన్లో ఐపీఎల్ టికెట్లు అన్ని క్లోజ్ అవ్వడంతో విక్రయాలు మొత్తాన్ని పేటీఎం నిలిపివేసింది. అయినప్పటికీ, సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ టికెట్లు అంటూ మోసాలకు పాల్పడుతున్నారు.
క్యూఆర్ కోడ్స్ పంపించి ముఠా సభ్యులు డబ్బులు గుంజుతున్నారు. టికెట్ల కొనుగోలుపై డిస్కౌంట్ ఇస్తామంటూ ముఠాలు మోసాలు చేస్తున్నారని, తస్మాత్ జాగ్రత్త అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఐపీఎల్ టికెట్ల అమ్మకాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సైబర్ క్రైం రంగంలోకి దిగింది. ఆన్లైన్లో ఐపీఎల్ టికెట్ల అమ్మకాలను అసలు నమ్మోద్దని, లేదంటే మోసపోతారని క్రికెట్ అభిమానులను సైబర్ పోలీసులు అలర్ట్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







