శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ వీసాతో పట్టుబడిన మహిళ
- June 05, 2016
నకిలీ వీసాతో దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన ఓ మహిళను ఆర్జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్కు చెందిన రేణుక(35) ఆదివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళుతుండగా ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీ చేశారు. ఆమె వద్ద ఉన్న వీసా నకిలీదిగా గుర్తించి ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. అయితే తాను ఏజెంట్ చేతిలో మోసపోయానంటూ సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







