ఖతార్లో అరుదైన తాబేలు నెస్టింగ్ సీజన్ ప్రారంభం
- April 02, 2024
దోహా: పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoECC) సముద్ర తాబేలు నెస్టింగ్ సీజన్ ప్రారంభమైనట్లు ప్రకటించింది. ఇది ఏప్రిల్ 1 నుండి ఆగస్టు 1 వరకు ఉంటుందని వెల్లడించింది. అరుదైన మరియు అంతరించిపోతున్న సముద్ర తాబేళ్లు దేశంలోని ఉత్తర తీరాలలో గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయని, ముఖ్యంగా ఖతార్లో గూడు కట్టుకున్న హాక్స్బిల్ తాబేళ్లతో సహా సముద్ర తాబేళ్లు వలస జాతులలో ఒకటిగా పరిగణించబడతుందని పేర్కొంది. సముద్ర తాబేళ్లను రక్షించడం, సంరక్షించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపింది. ఏటా, సముద్ర తాబేళ్లు ఖతార్ యొక్క ఉత్తర తీరాల వెంబడి ఒక గూడులో 75 నుండి 100 గుడ్లు పెడతాయని, రాష్ట్ర సముద్ర వాతావరణంలో గొప్ప జీవవైవిధ్యం మరియు పర్యావరణ సమతుల్యతకు దోహదం చేస్తుందని వెల్లడించింది. ఇదిలా ఉండగా.. వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్ హాక్స్బిల్ సముద్ర తాబేళ్లను తీవ్రంగా అంతరించిపోతున్నట్లు వర్గీకరించింది.
తాజా వార్తలు
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'