ఖతార్లో అరుదైన తాబేలు నెస్టింగ్ సీజన్ ప్రారంభం
- April 02, 2024
దోహా: పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoECC) సముద్ర తాబేలు నెస్టింగ్ సీజన్ ప్రారంభమైనట్లు ప్రకటించింది. ఇది ఏప్రిల్ 1 నుండి ఆగస్టు 1 వరకు ఉంటుందని వెల్లడించింది. అరుదైన మరియు అంతరించిపోతున్న సముద్ర తాబేళ్లు దేశంలోని ఉత్తర తీరాలలో గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయని, ముఖ్యంగా ఖతార్లో గూడు కట్టుకున్న హాక్స్బిల్ తాబేళ్లతో సహా సముద్ర తాబేళ్లు వలస జాతులలో ఒకటిగా పరిగణించబడతుందని పేర్కొంది. సముద్ర తాబేళ్లను రక్షించడం, సంరక్షించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపింది. ఏటా, సముద్ర తాబేళ్లు ఖతార్ యొక్క ఉత్తర తీరాల వెంబడి ఒక గూడులో 75 నుండి 100 గుడ్లు పెడతాయని, రాష్ట్ర సముద్ర వాతావరణంలో గొప్ప జీవవైవిధ్యం మరియు పర్యావరణ సమతుల్యతకు దోహదం చేస్తుందని వెల్లడించింది. ఇదిలా ఉండగా.. వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్ హాక్స్బిల్ సముద్ర తాబేళ్లను తీవ్రంగా అంతరించిపోతున్నట్లు వర్గీకరించింది.
తాజా వార్తలు
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం









