ఖతార్లో అరుదైన తాబేలు నెస్టింగ్ సీజన్ ప్రారంభం
- April 02, 2024
దోహా: పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoECC) సముద్ర తాబేలు నెస్టింగ్ సీజన్ ప్రారంభమైనట్లు ప్రకటించింది. ఇది ఏప్రిల్ 1 నుండి ఆగస్టు 1 వరకు ఉంటుందని వెల్లడించింది. అరుదైన మరియు అంతరించిపోతున్న సముద్ర తాబేళ్లు దేశంలోని ఉత్తర తీరాలలో గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయని, ముఖ్యంగా ఖతార్లో గూడు కట్టుకున్న హాక్స్బిల్ తాబేళ్లతో సహా సముద్ర తాబేళ్లు వలస జాతులలో ఒకటిగా పరిగణించబడతుందని పేర్కొంది. సముద్ర తాబేళ్లను రక్షించడం, సంరక్షించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపింది. ఏటా, సముద్ర తాబేళ్లు ఖతార్ యొక్క ఉత్తర తీరాల వెంబడి ఒక గూడులో 75 నుండి 100 గుడ్లు పెడతాయని, రాష్ట్ర సముద్ర వాతావరణంలో గొప్ప జీవవైవిధ్యం మరియు పర్యావరణ సమతుల్యతకు దోహదం చేస్తుందని వెల్లడించింది. ఇదిలా ఉండగా.. వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్ హాక్స్బిల్ సముద్ర తాబేళ్లను తీవ్రంగా అంతరించిపోతున్నట్లు వర్గీకరించింది.
తాజా వార్తలు
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!
- చైనా, మలేషియా బ్యాటరీల పై GCC సుంకాలు..!!
- కొత్త పార్కులు, డిజిటల్ రెసిలెన్స్ పాలసీని ప్రకటించిన షేక్ హమ్దాన్..!!
- సౌదీలో అమీర్.. ద్వైపాక్షిక పెట్టుబడుల వృద్ధిపై సమీక్ష..!!
- బహ్రెయిన్-భారత్ మధ్య ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఒమన్ లో బ్యాలెట్, ఆర్కెస్ట్రా కాన్సర్టుల సీజన్..!!
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…







