స్కూల్ ట్యూషన్ ఫీజులకు డైరెక్ట్ డెబిట్, పే-లేటర్ ఆప్షన్లు
- April 02, 2024
యూఏఈ: కొత్తగా ప్రారంభించబడిన పాఠశాల ఫీజు చెల్లింపు యాప్ యూఏఈ కుటుంబాలలో ప్రజాదరణ పొందుతోంది. ఇది వాయిదాలలో చెల్లించే అవకాశాన్ని ఇది అందిస్తుంది. ఎడ్యుకేషన్ డొమైన్ కోసం పేపర్లెస్ డైరెక్ట్ డెబిట్ సొల్యూషన్స్లో దేశంలోనే అగ్రగామిగా ఉన్న డైరెక్ట్ డెబిట్ సిస్టమ్, ఫిన్టెక్ స్టార్ట్-అప్ ‘Zenda’ తో చేతులు కలిపింది. వారు ఆటోమేటెడ్ మరియు డిజిటలైజ్డ్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ట్యూషన్, సంబంధిత విద్యా ఖర్చుల చెల్లింపు ప్రక్రియలో విప్లవాత్మక మార్పులను లక్ష్యంగా చేసుకున్నారు. యూజర్-స్నేహపూర్వక చెల్లింపు యాప్ను పేపర్లెస్ డైరెక్ట్ డెబిట్ సిస్టమ్తో అనుసంధానిస్తుంది. తల్లిదండ్రులు పే-నౌ మరియు పే-లేటర్ ఆప్షన్లతో పాఠశాల బిల్లులను సెటిల్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. ట్యూషన్ ఫీజుతో పాటు, కుటుంబాలు యాప్ ద్వారా తమ చెల్లింపు ఎంపికలను విస్తరించేందుకు రవాణా మరియు భోజనం వంటి ఇతర సేవలను కూడా ఈ యాఫ్ పొందవచ్చు. యూఏఈ సెంట్రల్ బ్యాంక్ సిస్టమ్కు మద్దతు ఇస్తుందని యాప్ వ్యవస్థాపకుడు , సీఈ ఉమ్మైర్ బట్ తెలిపారు. యూఏఈలో పూర్తి డిజిటల్ రికరింగ్ చెల్లింపుల ప్లాట్ఫారమ్ను అందించడంలో అగ్రగామిగా ఉన్న డైరెక్ట్ డెబిట్ సిస్టమ్తో చేతులు కలిపామని, తమ సేవలు విద్యా సంస్థలు సౌలభ్యాన్ని అందించడంలో సహాయపడతాయని, వారి రుణ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉంటుందని సహ వ్యవస్థాపకుడు రామన్ త్యాగరాజన్ వివరించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







