ఇరవై నాలుగు గంటలు ఎస్.పీ.బి పాటలను పాడి రికార్డుల్లోకి ఎక్కిన మధు బాపు
- April 03, 2024
హైదరాబాద్: ఏకధాటిగా ఇరవై నాలుగు గంటలు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం పాటలను పాడి రికార్డ్ సృష్టించిన మధు బాపు శాస్త్రి విఖ్యాత గాయకుడు బాలు మెచ్చిన గాయకుడు అని వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు ప్రశంసించారు.శ్రీ త్యాగరాయ గాన సభ లోని కళా సుబ్బారావు కళా వేదిక పై మనీషా ఆర్ట్స్ నిర్వహణలో వంశీ ఇంటర్నేషనల్ అభినందన లతో ప్రముఖ గాయకుడు మధు బాపు శాస్త్రి కి శోభన్ బాబు వంశీ ముజిక్ అవార్డ్ ప్రదాన సభ సంగీత భరితం గా జరిగింది.ముఖ్య అతిథిగా వంశీ రామరాజు పాల్గొని మాట్లాడుతూ వంశీ సంస్థను జ్యోతి ప్రజ్వలన చేసి నటుడు శోభన్ బాబు ఏబై ఏళ్ల క్రితం ప్రారంభించారని గుర్తు చేశారు.ఆయన సినిమాలలో పాటలను అద్భుతంగా గానం చేస్తున్న మధు బాపు తన ప్రతిభతో ఎంతో ఉన్నత స్థాయి కి చేరాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. సినీ నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ త్వరలో మధు బాపు కు దాసరి నారాయణరావు అవార్డ్ ఇస్తామని ప్రకటించారు. మధు బాపు మాట్లాడుతూ శోభన్ బాబు, బాల సుబ్రహ్మణ్యం విగ్రహాలు హైదరాబాద్ నగరం లో ప్రతిష్ఠ కోసం కృషి చేయాలని కోరారు.వేదిక పై కృష్ణ ప్రసాద్, సంగీత దర్శకుడు శ్రీధర్ ఆత్రేయ తదితరులు పాల్గొన్నారు తొలుత మధు బాపు, శ్రీదేవి,రేవతి, శ్రీకాంత్ స్వప్న, సాయి సింధూర తదితరులు పాడిన పాటలకు కిక్కిరిసిన శ్రోతలు ముగ్ధ లైనారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







