నేషనల్ మారిటైమ్ డే
- April 05, 2024
దక్షిణాన హిందూ మహాసముద్రం మరియు తూర్పు మరియు పశ్చిమ దిశలలో అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతంతో చుట్టుముట్టబడి, భారతదేశం పురాతన కాలంలోనే శక్తివంతమైన నౌకాదళంగా ఉంది. నేషనల్ మారిటైమ్ వీక్ చివరి రోజున, ఏప్రిల్ 5న భారతదేశంలో జాతీయ సముద్ర దినోత్సవం లేదా నేషనల్ మారిటైమ్ డేను జరుపుకుంటారు.
భారతదేశ నావిగేషన్లో, సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ లిమిటెడ్ యొక్క మొదటి నౌక SS లాయల్టీ యునైటెడ్ కింగ్డమ్కు ప్రయాణించినప్పుడు ఒక చరిత్ర సృష్టించబడింది. సముద్ర మార్గాలు బ్రిటిష్ వారిచే నియంత్రించబడినప్పుడు ఇది భారతదేశ షిప్పింగ్ చరిత్రలో కీలకమైన దశ. ఖండాంతర వాణిజ్యం మరియు ఆర్థిక వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ 5,1964న మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని జరుపుకున్నారు.
నౌకాయాన రంగానికి విశేష కృషి చేసిన విశిష్టమైన మరియు అసాధారణమైన విజయాలు సాధించిన వ్యక్తులను గుర్తించి, గౌరవించడం కోసం "NMD అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్" ను కేంద్రం ప్రవేశపెట్టింది. ఈరోజునే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









