నేషనల్ మారిటైమ్ డే
- April 05, 2024
దక్షిణాన హిందూ మహాసముద్రం మరియు తూర్పు మరియు పశ్చిమ దిశలలో అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతంతో చుట్టుముట్టబడి, భారతదేశం పురాతన కాలంలోనే శక్తివంతమైన నౌకాదళంగా ఉంది. నేషనల్ మారిటైమ్ వీక్ చివరి రోజున, ఏప్రిల్ 5న భారతదేశంలో జాతీయ సముద్ర దినోత్సవం లేదా నేషనల్ మారిటైమ్ డేను జరుపుకుంటారు.
భారతదేశ నావిగేషన్లో, సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ లిమిటెడ్ యొక్క మొదటి నౌక SS లాయల్టీ యునైటెడ్ కింగ్డమ్కు ప్రయాణించినప్పుడు ఒక చరిత్ర సృష్టించబడింది. సముద్ర మార్గాలు బ్రిటిష్ వారిచే నియంత్రించబడినప్పుడు ఇది భారతదేశ షిప్పింగ్ చరిత్రలో కీలకమైన దశ. ఖండాంతర వాణిజ్యం మరియు ఆర్థిక వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ 5,1964న మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని జరుపుకున్నారు.
నౌకాయాన రంగానికి విశేష కృషి చేసిన విశిష్టమైన మరియు అసాధారణమైన విజయాలు సాధించిన వ్యక్తులను గుర్తించి, గౌరవించడం కోసం "NMD అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్" ను కేంద్రం ప్రవేశపెట్టింది. ఈరోజునే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!