'బొబ్బిలి రాజా' ఈజ్ బ్యాక్ ..
- June 06, 2016
వెంకటేశ్ హీరోగా నటించిన 'బొబ్బిలి రాజా' చిత్రంలో వెంకీ ఊతపదం 'అయ్యో అయ్యో అయ్యయ్యో..' గుర్తుందిగా. అంత త్వరగా మరిచిపోయేది కాదులెండి. వెంకీలోని అదే చిలిపిదనాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చారు దర్శకుడు మారుతి. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కతోన్న చిత్రం 'బాబు బంగారం'. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూరద్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాకి ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పకుడు. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమా టీజర్ నేడు విడుదలైంది. ఇందులో వెంకీ పలికిన సరదా సంభాషణలు ఆకట్టుకునే ఉన్నాయి. చివర్లో వచ్చిన 'అయ్యో అయ్యో అయ్యయ్యో' డైలాగ్ అయితే 'బొబ్బిలి రాజా' ఈజ్ బ్యాక్ అన్నట్టుగా ఉంది.ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాకి జిబ్రాన్ సంగీత దర్శకుడు. త్వరలో ఈ సినిమా ఆడియో విడుదల కానుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







