'బొబ్బిలి రాజా' ఈజ్ బ్యాక్ ..

- June 06, 2016 , by Maagulf
'బొబ్బిలి రాజా' ఈజ్ బ్యాక్ ..

వెంకటేశ్ హీరోగా నటించిన 'బొబ్బిలి రాజా' చిత్రంలో వెంకీ ఊతపదం 'అయ్యో అయ్యో అయ్యయ్యో..' గుర్తుందిగా. అంత త్వరగా మరిచిపోయేది కాదులెండి. వెంకీలోని అదే చిలిపిదనాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చారు దర్శకుడు మారుతి. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కతోన్న చిత్రం 'బాబు బంగారం'. సితార ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై సూరద్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాకి ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పకుడు. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా టీజర్ నేడు విడుదలైంది. ఇందులో వెంకీ పలికిన సరదా సంభాషణలు ఆకట్టుకునే ఉన్నాయి. చివర్లో వచ్చిన 'అయ్యో అయ్యో అయ్యయ్యో' డైలాగ్ అయితే 'బొబ్బిలి రాజా' ఈజ్ బ్యాక్ అన్నట్టుగా ఉంది.ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకి జిబ్రాన్ సంగీత దర్శకుడు. త్వరలో ఈ సినిమా ఆడియో విడుదల కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com