షార్జా అగ్నిప్రమాదం..ఇద్దరు భారతీయులు సహా ఐదుగురు మృతి

- April 08, 2024 , by Maagulf
షార్జా అగ్నిప్రమాదం..ఇద్దరు భారతీయులు సహా ఐదుగురు మృతి

యూఏఈ: గురువారం రాత్రి షార్జాలోని అల్ నహ్దా ప్రాంతంలో నివాస భవనంలో చెలరేగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు నివాసితులలో ఇద్దరు భారతీయులు ఉన్నారని కుటుంబ స్నేహితులు, సామాజిక కార్యకర్తలు ధృవీకరించారు. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (DWTC)లో DXB లైవ్ ఉద్యోగి మైఖేల్ సత్యదాస్ ఈ విషాదంలో మరణించిన ఇద్దరు భారతీయులలో ఒకరు. అతని సోదరుడి సోషల్ మీడియా పోస్ట్‌ల ప్రకారం.. మైఖేల్ సౌండ్ ఇంజనీర్, అతను తన కెరీర్‌లో బ్రూనో మార్స్, AR రెహమాన్ వంటి ప్రఖ్యాత కళాకారులను కాన్సర్ట్ లకు సహకరించాడు. రెండవ బాధితురాలు ముంబైకి చెందిన 29 ఏళ్ల మహిళ. ఆమె భర్త ఇప్పటికీ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.     

750 అపార్ట్‌మెంట్‌లతో కూడిన 9 అంతస్తుల టవర్‌లో మంటలు చెలరేగడంతో ఐదుగురు మరణించగా.. 44 మంది గాయపడ్డారు. దీంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com