షార్జా అగ్నిప్రమాదం..ఇద్దరు భారతీయులు సహా ఐదుగురు మృతి
- April 08, 2024
యూఏఈ: గురువారం రాత్రి షార్జాలోని అల్ నహ్దా ప్రాంతంలో నివాస భవనంలో చెలరేగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు నివాసితులలో ఇద్దరు భారతీయులు ఉన్నారని కుటుంబ స్నేహితులు, సామాజిక కార్యకర్తలు ధృవీకరించారు. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (DWTC)లో DXB లైవ్ ఉద్యోగి మైఖేల్ సత్యదాస్ ఈ విషాదంలో మరణించిన ఇద్దరు భారతీయులలో ఒకరు. అతని సోదరుడి సోషల్ మీడియా పోస్ట్ల ప్రకారం.. మైఖేల్ సౌండ్ ఇంజనీర్, అతను తన కెరీర్లో బ్రూనో మార్స్, AR రెహమాన్ వంటి ప్రఖ్యాత కళాకారులను కాన్సర్ట్ లకు సహకరించాడు. రెండవ బాధితురాలు ముంబైకి చెందిన 29 ఏళ్ల మహిళ. ఆమె భర్త ఇప్పటికీ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.
750 అపార్ట్మెంట్లతో కూడిన 9 అంతస్తుల టవర్లో మంటలు చెలరేగడంతో ఐదుగురు మరణించగా.. 44 మంది గాయపడ్డారు. దీంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









