షార్జా అగ్నిప్రమాదం..ఇద్దరు భారతీయులు సహా ఐదుగురు మృతి
- April 08, 2024
యూఏఈ: గురువారం రాత్రి షార్జాలోని అల్ నహ్దా ప్రాంతంలో నివాస భవనంలో చెలరేగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు నివాసితులలో ఇద్దరు భారతీయులు ఉన్నారని కుటుంబ స్నేహితులు, సామాజిక కార్యకర్తలు ధృవీకరించారు. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (DWTC)లో DXB లైవ్ ఉద్యోగి మైఖేల్ సత్యదాస్ ఈ విషాదంలో మరణించిన ఇద్దరు భారతీయులలో ఒకరు. అతని సోదరుడి సోషల్ మీడియా పోస్ట్ల ప్రకారం.. మైఖేల్ సౌండ్ ఇంజనీర్, అతను తన కెరీర్లో బ్రూనో మార్స్, AR రెహమాన్ వంటి ప్రఖ్యాత కళాకారులను కాన్సర్ట్ లకు సహకరించాడు. రెండవ బాధితురాలు ముంబైకి చెందిన 29 ఏళ్ల మహిళ. ఆమె భర్త ఇప్పటికీ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.
750 అపార్ట్మెంట్లతో కూడిన 9 అంతస్తుల టవర్లో మంటలు చెలరేగడంతో ఐదుగురు మరణించగా.. 44 మంది గాయపడ్డారు. దీంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







