‘కిస్మత్’ .! బీటెక్ స్టూడెంట్స్ భవిష్యత్ ‘చిత్రం’.!
- April 08, 2024
బీటెక్ చేసిన కుర్రోళ్లు బయటికొచ్చాకా, వుద్యోగాలు దొరక్క పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. వింటుంటే కామెడీగా వుంటుంది కానీ, ఆ స్ర్టెస్ తీసుకుంటున్న కుర్రాళ్లకే అర్ధమవుతుంది ఆ బాధేంటో.
తాజాగా అలాంటి ఓ ముగ్గురు బీటెక్ కుర్రాళ్ల జీవితాన్ని సినిమాగా తెరపై ఆవిష్కరించాడు ఓ డైరెక్టర్. ఆ సినిమా పేరే ‘కిస్మత్’. ఫీజు రీఎంబర్స్మెంట్ మీద బీటెక్ పూర్తి చేసి, ఉద్యోగం దొరక్క, ఇంట్లో తల్లిదండ్రుల పోరు పడలేక హైద్రాబాద్ చేరిన ఆ ముగ్గురు కుర్రోళ్లు చివరికి ఉద్యోగాలు సంపాదించారా.? అందుకోసం వారు పడిన పాట్లేంటీ.? కిస్మత్ వారిని ఎలా వరించింది.? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
అందుకోసం ధియేటర్లకు పోవాల్సిన పని లేదండోయ్. ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో వుంది. చిన్న బడ్జెట్లో సినిమాటిక్ అంశాలన్నీ జోడించి, కమర్షియల్ ఫార్మేట్లోనే ఈ సినిమాని వినోదాత్మకంగా తెరకెక్కించారు.
ఈ క్రైమ్ కామెడీ డ్రామాకి ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. నరేష్ అగస్త్య, అభినవ్ గోమటం, రియా సుమన్, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రలు పోషించారు ఈ సినిమాలో.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







