భారతీయ రైలు రవాణా దినోత్సవం
- April 16, 2024
ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్వర్క్స్లో ఇండియన్ రైల్వేస్(Indian Railways) ముందు వరుసలో ఉంటుంది. సరుకు రవాణాతో పాటు ప్రజలను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడంలో భారత రైల్వే కీలక పాత్ర పోషిస్తుంది. నేడు భారతీయ రైలు రవాణా దినోత్సవం.
మన దేశంలో సుమారు 170 ఏళ్ల క్రితమే మొదటి రైలు అందుబాటులోకి వచ్చింది. 1853, ఏప్రిల్ 16న భారతీయ రైల్వే బోరి బందర్ (ప్రస్తుతం ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ ) నుంచి థానే మధ్య మొదటి ప్యాసింజర్ రైలును ప్రవేశపెట్టింది. 34 కిలోమీటర్ల దూరాన్ని ఈ ట్రైన్ కవర్ చేసేది. అయితే దీని జ్ఞాపకార్థంగా ఏటా ఏప్రిల్ 16న భారతీయ రైలు రవాణా దినోత్సవం (Indian Rail Transport Day) జరుపుకుంటున్నారు.
భారతదేశంలో రైల్వేలకు పునాది వేయడంలో జమ్సెట్జీ జీజీభోయ్, జగన్నాథ్ సుంకర్సేత్ కీలక పాత్ర పోషించారు. 160 ఏళ్ల క్రితం వీరిద్దరే తొలి రైల్వే రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. దేశంలో రైల్వే మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడంలో, మద్దతు ఇవ్వడంలో అందరికంటే వారే ముందున్నారు.1853 నుంచి భారతీయ రైల్వేలు సామాన్యుల జీవితంలో అంతర్భాగమైందని, దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధికి రైల్వేలు దోహదపడుతున్నాయి.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









