భారతీయ రైలు రవాణా దినోత్సవం
- April 16, 2024ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్వర్క్స్లో ఇండియన్ రైల్వేస్(Indian Railways) ముందు వరుసలో ఉంటుంది. సరుకు రవాణాతో పాటు ప్రజలను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడంలో భారత రైల్వే కీలక పాత్ర పోషిస్తుంది. నేడు భారతీయ రైలు రవాణా దినోత్సవం.
మన దేశంలో సుమారు 170 ఏళ్ల క్రితమే మొదటి రైలు అందుబాటులోకి వచ్చింది. 1853, ఏప్రిల్ 16న భారతీయ రైల్వే బోరి బందర్ (ప్రస్తుతం ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ ) నుంచి థానే మధ్య మొదటి ప్యాసింజర్ రైలును ప్రవేశపెట్టింది. 34 కిలోమీటర్ల దూరాన్ని ఈ ట్రైన్ కవర్ చేసేది. అయితే దీని జ్ఞాపకార్థంగా ఏటా ఏప్రిల్ 16న భారతీయ రైలు రవాణా దినోత్సవం (Indian Rail Transport Day) జరుపుకుంటున్నారు.
భారతదేశంలో రైల్వేలకు పునాది వేయడంలో జమ్సెట్జీ జీజీభోయ్, జగన్నాథ్ సుంకర్సేత్ కీలక పాత్ర పోషించారు. 160 ఏళ్ల క్రితం వీరిద్దరే తొలి రైల్వే రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. దేశంలో రైల్వే మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడంలో, మద్దతు ఇవ్వడంలో అందరికంటే వారే ముందున్నారు.1853 నుంచి భారతీయ రైల్వేలు సామాన్యుల జీవితంలో అంతర్భాగమైందని, దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధికి రైల్వేలు దోహదపడుతున్నాయి.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల