భారతీయ రైలు రవాణా దినోత్సవం
- April 16, 2024
ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్వర్క్స్లో ఇండియన్ రైల్వేస్(Indian Railways) ముందు వరుసలో ఉంటుంది. సరుకు రవాణాతో పాటు ప్రజలను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడంలో భారత రైల్వే కీలక పాత్ర పోషిస్తుంది. నేడు భారతీయ రైలు రవాణా దినోత్సవం.
మన దేశంలో సుమారు 170 ఏళ్ల క్రితమే మొదటి రైలు అందుబాటులోకి వచ్చింది. 1853, ఏప్రిల్ 16న భారతీయ రైల్వే బోరి బందర్ (ప్రస్తుతం ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ ) నుంచి థానే మధ్య మొదటి ప్యాసింజర్ రైలును ప్రవేశపెట్టింది. 34 కిలోమీటర్ల దూరాన్ని ఈ ట్రైన్ కవర్ చేసేది. అయితే దీని జ్ఞాపకార్థంగా ఏటా ఏప్రిల్ 16న భారతీయ రైలు రవాణా దినోత్సవం (Indian Rail Transport Day) జరుపుకుంటున్నారు.
భారతదేశంలో రైల్వేలకు పునాది వేయడంలో జమ్సెట్జీ జీజీభోయ్, జగన్నాథ్ సుంకర్సేత్ కీలక పాత్ర పోషించారు. 160 ఏళ్ల క్రితం వీరిద్దరే తొలి రైల్వే రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. దేశంలో రైల్వే మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడంలో, మద్దతు ఇవ్వడంలో అందరికంటే వారే ముందున్నారు.1853 నుంచి భారతీయ రైల్వేలు సామాన్యుల జీవితంలో అంతర్భాగమైందని, దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధికి రైల్వేలు దోహదపడుతున్నాయి.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!









