తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..

- April 16, 2024 , by Maagulf
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..

తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. జూలై కోటాకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈనెల 18న టీటీడీ విడుదల చేయనుంది. 18వ తేదీ ఉదయం 10గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10గంటల వరకు సుప్రభాతం, తోమాల, అర్చన అష్టదళపాదపద్మారాధన టికెట్లు పొందడానికి ఆన్ లైన్ లో పేర్ల నమోదుకు అవకాశం ఉంటుంది. అదేరోజు మధ్యాహ్నం 12గంటలకు లక్కీడీప్ లో టికెట్లు కేటాయిస్తారు. వీటిని పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది.

కల్యోణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. అదేరోజు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జులై నెల కోటాను మధ్యాహ్నం 3గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.

ఏప్రిల్ 23న ఉదయం 10గంటలకు జులై నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.

 ఏప్రిల్ 23న శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూలై నెల ఆన్ లైన్ కోటాను ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వయో వృద్ధులు, దివ్యాంగుల, దీర్ఘకాలిక వ్యాదులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూలై నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఏప్రిల్ 23న మధ్యాహ్నం 3గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.

జూలై నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 24న ఉదయం 10గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.తిరుమల, తిరుపతిలలో జూలై నెల గదుల కోటాను ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.
ఏప్రిల్ 27న శ్రీవారి సేవ ఉదయం 11గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1గంటకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com