యూఏఈలో నిత్యవసర వస్తువుల ధరలు తగ్గుముఖం..!
- April 16, 2024యూఏఈ: భారతదేశంలో మంచి రుతుపవనాలు వస్తాయని భావిస్తున్న నేపథ్యంలో అధిక ఉత్పత్తి, దిగుమతులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో రాబోయే నెలల్లో యూఏఈలో అనేక వస్తువులు, కిరాణా వస్తువుల ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. యూఏఈకి పప్పులు, సుగంధ ద్రవ్యాలు, బియ్యం, గోధుమలు మరియు ఇతర వస్తువులను అత్యధికంగా ఎగుమతి చేసే దేశాలలో భారతదేశం ఒకటి. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) సంతకం చేసిన తర్వాత అటువంటి వస్తువుల వ్యాపారం గణనీయంగా పెరిగింది. 2024లో భారతదేశంలో సాధారణ రుతుపవనాలు నమోదవుతాయని, ఎల్నినో ప్రభావం ఉండదని ప్రైవేట్ వాతావరణ అంచనా ఏజెన్సీ స్కైమెట్ గత వారం తెలిపింది. భారతదేశం దక్షిణ, పశ్చిమ మరియు వాయువ్య భాగాలలో మంచి వర్షాలు కురుస్తాయని ఇది అంచనా వేసింది. దీంతో పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మరియు హర్యానా రాష్ట్రాలలో అధిక వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈద్ అల్ ఫితర్కు కొద్దిరోజుల ముందు యూఏఈకి మరో 10,000 టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతించింది. గత సంవత్సరం భారతదేశం నిషేధం విధించిన తర్వాత ఉల్లిపాయ ధరలు కిలోకు Dh2 నుండి Dh8 కంటే ఎక్కువకు పెరిగాయని ఆదిల్ గ్రూప్ ఆఫ్ సూపర్మార్కెట్ల ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ధనంజయ్ దాతర్ తెలిపారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..