యూఏఈలో అలర్ట్ జారీ జారీ
- April 17, 2024యూఏఈ: దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు క్షీణించడంతో నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ యూఏఈలోని చాలా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అసాధారణమైన తీవ్రతతో కూడిన ప్రమాదకర వాతావరణ సంఘటనలు అంచనా నేపథ్యంలో నివాసితులు 'అత్యంత అప్రమత్తంగా' ఉండాలని అధికార యంత్రాంగం కోరింది. ఆరెంజ్ అలర్ట్ ప్రాంతాలు నివాసితులు తప్పనిసరిగా లుకౌట్లో ఉండాలని, అయితే ఎల్లో హెచ్చరిక ప్రాంతాలు సాపేక్షంగా తేలికపాటి పరిస్థితులను ఎదుర్కోవచ్చు.
యూఏఈలోని ప్రభుత్వ ఉద్యోగులు బుధవారం కూడా ఇంటి నుండి పని చేయాలని ఉత్తర్వుల ద్వారా ఆదేశించారు. దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నందున ఈ హెచ్చరిక జారీ చేశారు. దేశంలో అస్థిర వాతావరణ పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల కోసం దుబాయ్ రిమోట్ వర్కింగ్ పీరియడ్ను పొడిగించింది. ఉద్యోగులను రిమోట్లో పనిచేయనివ్వాలని ప్రైవేట్ రంగ సంస్థలకు సూచించింది. షార్జాలోని ఫెడరల్ ఉద్యోగులు కూడా బుధవారం ఇంటి నుండి పని చేయాలని ఆదేశించారు. రెండు ఎమిరేట్స్లోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు బుధవారం ఆన్లైన్ తరగతులను నిర్వహించనున్నాయి.
తాజా వార్తలు
- UNHCR కోసం ఖతార్ ఎయిర్వేస్ ఉదారత..!
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!