5.5 మిలియన్లు దాటిన లుసైల్ ట్రామ్ ప్రయాణికులు
- April 17, 2024
దోహా: ఖతార్ రైల్వేస్ కంపెనీ (ఖతార్ రైల్) ఇటీవల లుసైల్ ట్రామ్ యొక్క పూర్తి ఆరెంజ్ లైన్ మరియు పింక్ లైన్లో సేవలను ప్రారంభించింది. ఖతార్ రైల్లో స్ట్రాటజీ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ చీఫ్ అజ్లాన్ ఈద్ అల్ ఎనాజీ మాట్లాడుతూ.. నైఫా, ఫాక్స్ హిల్స్ - సౌత్, డౌన్టౌన్ లుసైల్, అల్ ఖైల్ స్ట్రీట్, ఫాక్స్ హిల్స్ - నార్త్, క్రెసెంట్ పార్క్ - నార్త్, రౌదత్ లుసైల్, ఎర్కియా, లుసైల్ స్టేడియంతో సహా ఇటీవల ప్రారంభించిన కొత్త స్టేషన్లతో ఆరెంజ్ లైన్లోని అన్ని స్టేషన్లు ఇప్పుడు పూర్తిగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఇటీవలి సర్వీస్ విస్తరణలో అల్ సాద్ ప్లాజా స్టేషన్ను మినహాయించి, లెగ్టైఫియా నుండి ప్రారంభమై సీఫ్ లుసైల్ - నార్త్కు చేరుకునే అన్ని పింక్ లైన్ స్టేషన్లను కూడా ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతి ట్రామ్ రైలులో 64 సీట్లు ఉంటాయని, స్టాండర్డ్ మరియు ఫ్యామిలీ క్లాస్ రెండింటిలోనూ 209 మంది ప్రయాణీకుల సౌకర్యవంతమైన సామర్థ్యం ఉంటుందని వివరించారు. ప్రతి రైలులో ప్రయాణ సమాచారాన్ని ప్రదర్శించడానికి ఆరు స్క్రీన్లు, దాదాపు 20 USB పోర్ట్లు ఉంటాయి. ట్రామ్ మెట్రో నుండి భిన్నంగా ఉంటుంది. దీనిలో ప్రతి ట్రామ్కు డ్రైవర్ ఉంటారు. దాని గరిష్ట వేగం గంటకు సుమారు 60 కి.మీ. LED లైటింగ్ మరియు ఎలక్ట్రిక్ బ్రేక్ సిస్టమ్లను ఉపయోగించే ట్రామ్లు పర్యావరణ అనుకూల వ్యవస్థలుగా పనిచేయనున్నాయి. ట్రావెల్ కార్డ్లు ట్రామ్, మెట్రో రెండింటిలోనూ పనిచేస్తాయని తెలిపారు. "జనవరి 2022లో ప్రారంభించినప్పటి నుండి మొత్తం ట్రామ్ వినియోగదారుల సంఖ్య సుమారు 5.5 మిలియన్ల మంది ప్రయాణికులకు చేరుకుంది. FIFA వరల్డ్ కప్ 2022 మరియు 2023 AFC ఆసియా కప్తో సహా గత రెండు సంవత్సరాలుగా దేశం నిర్వహించిన ప్రధాన ఈవెంట్లలో లుసైల్ నగరంలో నివాసితులు, సందర్శకుల రవాణాను సులభతరం చేయడంలో ట్రామ్ ముఖ్యమైన పాత్ర పోషించింది’’ అని ఆయన అన్నారు. లుసైల్ సిటీకి వచ్చే సందర్శకులందరూ జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని మరియు ట్రాఫిక్ చిహ్నాలను పాటించాలని ఆయన సూచించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..







