తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- April 18, 2024
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్కి వేళైంది. ఈ నెల 18.. అంటే రేపే.. ఏపీలో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 25 లోపు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ వేసేందుకు అవకాశం ఉంటుంది. పబ్లిక్ హాలిడేలు, సెలవు దినాల్లోనూ నామినేషన్లు స్వీకరిస్తారు. దీంతో నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకుంటున్నారు అభ్యర్థులు.. నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థుల వాహనాలను 200 మీటర్ల దూరంలోనే అధికారులు నిలిపివేస్తారు.
అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే నామినేషన్ కేంద్రంలోకి అనుమతిస్తారు. హైదరాబాద్, విజయవాడలోనూ రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. హైదరాబాద్ లోక్సభ పరిధిలో నామినేషన్లకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నేపథ్యంలో నగరంలో ప్రత్యేక నిఘా పెట్టినట్టు అధికారులు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వివరాలు..
ఏప్రిల్ 18 – నామినేషన్ల స్వీకరణ
ఏప్రిల్ 25 – నామినేషన్లకు చివరి తేదీ
ఏప్రిల్ 26 – నామినేషన్ల పరిశీలన
ఏప్రిల్ 29 – నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
మే 13 – పోలింగ్
జూన్ 4 – ఎన్నికల ఫలితాలు.
నాలుగో దశలో.. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున.. మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సైతం మే 13న జరగనున్నాయి. నాలుగో దశలో 96 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మే 13న ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలను జూన్ 4వ తేదీన ప్రకటించనున్నారు.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







