క్లౌడ్-సీడింగ్ పుకార్లను ఖండించిన యూఏఈ
- April 18, 2024
యూఏఈ: క్లౌడ్-సీడింగ్ పుకార్లను జాతీయ వాతావరణ కేంద్రం (NCM) ఖండించింది. భారీ వర్షాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా జనజీవనానికి అంతరాయం కలిగింది. దీంతో క్లౌడ్ సీడింగ్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో, క్లౌడ్ సీడింగ్ జరగదని ఎన్సిఎమ్కి చెందిన డాక్టర్ అహ్మద్ హబీబ్ తెలిపారు. మరోవైపు యూఏఈలో మంగళవారం అసాధారణ వర్షపాతం నమోదైంది. 75 ఏళ్లలో అత్యధిక వర్షపాతం నమోదైంది. దేశంలోని పలు ప్రాంతాలలో ఒక్కరోజులో 110మి.మీ వర్షం కురిసింది. దీంతో చాలా మంది నివాసితులు ఇబ్బందులు పడ్డారు. వరదలతో నిండిన రోడ్లు, ఇళ్లు మరియు విమానాశ్రయాలు మరియు మాల్స్తో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటి వరకు అల్ ఐన్లోని ఖత్మ్ అల్ షక్లా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైందని, 24 గంటల్లోపు 254 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని ఎన్సిఎం తెలిపింది.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







