ఆది సాయికుమార్ కొత్త సినిమా అనౌన్స్..
- April 18, 2024
హైదరాబాద్: టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్.. సినిమాలు, వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్నారు. విజయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న వస్తున్న ఈ హీరో గత ఏడాది.. ఏకంగా ఇది చిత్రాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఇక ఇటీవల ‘CSI సనాతన’ సినిమాతో మంచి రివ్యూలనే అందుకున్నారు. ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టిన ఆది సాయి కుమార్.. తాజాగా మరో సినిమా స్టార్ట్ చేసారు.
అదికూడా సూపర్ హిట్ కాంబోని రిపీట్ చేస్తూ ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. గతంలో తనకి ‘చుట్టలబ్బాయ్’ సినిమాతో మంచి విజయాన్ని అందించిన దర్శకుడు వీరభద్రమ్ చౌదరితో కలిసి మరో సినిమాని తీసుకు రాబోతున్నారు. చుట్టలబ్బాయ్ మూవీ లాగానే ఈ చిత్రం కూడా విలేజ్ డ్రామాతో ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీతో ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతుందట.
ఇక ఈ చిత్రానికి ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. నేడు ఈ మూవీని పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసారు. దిల్ రాజు, అనిల్ రావిపూడి, సాయి కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్ పై తూము నరసింహా, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ మూవీ లాంచ్ తో పాటు ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసారు. దిగంగనా సూర్యవంశీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకోనుంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







