రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఇదే..
- April 18, 2024
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల కేరళలో పర్యటన నేటితో పూర్తి కానుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం హైదరాబాద్ కి రానున్నారు.రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు పయనం కానున్నారు. ముఖ్యంగా రేపు ఉదయం మహబూబ్ నగర్ లో పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం లో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు సాయంత్రం మహబూబాబాద్ లో జరిగే బహిరంగ సభ లో పాల్గొననున్న సీఎం రేవంత్…..20 న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమం లో పాల్గొననున్నారు.
ఈ నెల 20 న సాయంత్రం కర్ణాటక లో ప్రచారం లో పాల్గొననున్న రేవంత్… 21న భువనగిరి లో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమం లో పాల్గొననున్నారు. ఇక ఈ నెల 22 న ఉదయం ఆదిలాబాద్ లో నిర్వహించే సభ లో పాల్గొననున్న సీఎం రేవంత్… 23న నాగర్ కర్నూల్ జరిగే బహిరంగ సభ లో పాల్గొన్ననున్నారు. ఈ నెల 24న ఉదయం జహిరాబాద్, సాయంత్రం వరంగల్ లో నిర్వహించే సభ ల్లో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ అయింది.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







