రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఇదే..
- April 18, 2024హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల కేరళలో పర్యటన నేటితో పూర్తి కానుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం హైదరాబాద్ కి రానున్నారు.రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు పయనం కానున్నారు. ముఖ్యంగా రేపు ఉదయం మహబూబ్ నగర్ లో పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం లో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు సాయంత్రం మహబూబాబాద్ లో జరిగే బహిరంగ సభ లో పాల్గొననున్న సీఎం రేవంత్…..20 న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమం లో పాల్గొననున్నారు.
ఈ నెల 20 న సాయంత్రం కర్ణాటక లో ప్రచారం లో పాల్గొననున్న రేవంత్… 21న భువనగిరి లో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమం లో పాల్గొననున్నారు. ఇక ఈ నెల 22 న ఉదయం ఆదిలాబాద్ లో నిర్వహించే సభ లో పాల్గొననున్న సీఎం రేవంత్… 23న నాగర్ కర్నూల్ జరిగే బహిరంగ సభ లో పాల్గొన్ననున్నారు. ఈ నెల 24న ఉదయం జహిరాబాద్, సాయంత్రం వరంగల్ లో నిర్వహించే సభ ల్లో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ అయింది.
తాజా వార్తలు
- పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం..
- ముబారక్ అల్-కబీర్ను కలిసిన భారత రాయబారి
- ఖతార్లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు