రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఇదే..
- April 18, 2024
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల కేరళలో పర్యటన నేటితో పూర్తి కానుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం హైదరాబాద్ కి రానున్నారు.రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు పయనం కానున్నారు. ముఖ్యంగా రేపు ఉదయం మహబూబ్ నగర్ లో పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం లో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు సాయంత్రం మహబూబాబాద్ లో జరిగే బహిరంగ సభ లో పాల్గొననున్న సీఎం రేవంత్…..20 న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమం లో పాల్గొననున్నారు.
ఈ నెల 20 న సాయంత్రం కర్ణాటక లో ప్రచారం లో పాల్గొననున్న రేవంత్… 21న భువనగిరి లో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమం లో పాల్గొననున్నారు. ఇక ఈ నెల 22 న ఉదయం ఆదిలాబాద్ లో నిర్వహించే సభ లో పాల్గొననున్న సీఎం రేవంత్… 23న నాగర్ కర్నూల్ జరిగే బహిరంగ సభ లో పాల్గొన్ననున్నారు. ఈ నెల 24న ఉదయం జహిరాబాద్, సాయంత్రం వరంగల్ లో నిర్వహించే సభ ల్లో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ అయింది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







