కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- April 18, 2024
హైదరాబాద్: తన కూతురు, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి స్పందించారు. కవిత ఎలాంటి తప్పు చేయలేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. రాజకీయంగా కక్ష సాధింపు కోసమే కవితను అరెస్టు చేశారని కేసీఆర్ ఆరోపించారు. కవిత లిక్కర్ స్కామ్ పై ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు చూపలేకపోతున్నారని కామెంట్ చేశారు.
”ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అంతా ఉత్తిదే. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోశ్ ను అరెస్ట్ చేయడానికి మనం పోలీసులను పంపించాం. అప్పటి నుంచి మోదీ మనపై కక్ష కట్టారు. అందుకే కవితను అరెస్ట్ చేయించి జైలుకి పంపారు. మోదీ దుర్మార్గుడు” అని కేసీఆర్ విరుచుకుపడ్డారు.
మరోవైపు ఈ నెల 20వ తేదీ నుండి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. అలంపూర్ జోగులాంబ నుండి కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. 8 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 500 రూపాయల బోనస్ కోసం పంట కల్లాల దగ్గర పోరాటాలకు పిలుపునిచ్చారు కేసీఆర్. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మనకు అనుకూలంగా మారుతున్నాయని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ సమన్వయంతో పని చేయాలని కేడర్ పిలుపునిచ్చారు గులాబీ బాస్.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







