హైదరాబాద్లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..
- April 19, 2024హైదరాబాద్: హైదరాబాద్లోని ఫిలింనగర్లో విషాదం చోటుచేసుకుంది. బైక్ నడుపుతూ బీఎండబ్ల్యూ కారుని ఢీకొట్టాడు ఓ మైనర్(14). దీంతో కారు రిపైర్ చేయించడానికి రూ.20 వేలు ఇవ్వాలని ఇద్దరు డ్రైవర్లు డిమాండ్ చేశారు.
ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే మైనర్ డ్రైవింగ్ కేసు పెడతామని బెదిరించారు. దీంతో ఆ బాలుడి కుటుంబంపై తీవ్ర ఒత్తిడి పడింది. డబ్బు లేదని, కొడుకు జైలుకు వెళ్తాడనే మనస్తాపంతో ఉరేసుకుని ఆ బాలుడి తల్లి సూర్య కుమారి (35) బలవన్మరణానికి పాల్పడింది.
ఆమె భర్త ఫిర్యాదుతో డైవర్లు చంద్ర శేఖర్, మహేశ్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కారు డామేజ్ అయితే యజమాని ఊరుకోడని, అందుకే డబ్బు ఇవ్వాలని కోరామని ఇద్దరు డ్రైవర్లు కన్నీటి పర్యంతమయ్యారు. తమ మీద కేసు పెడితే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని అవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!