యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!

- April 20, 2024 , by Maagulf
యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!

యూఏఈ: ఏప్రిల్ 16న కురిసిన కుండపోత వర్షాలలో ముగ్గురు మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. దుబాయ్‌లో ఒకరు, షార్జాలో ఇద్దరు మరణించినట్లు మనీలాలో ఫిలిప్పీన్స్ కాన్సులేట్ జనరల్ (పిసిజి)  ఫిలిపినో కార్మిక అధికారి  ప్రకటించారు. ఫిలిప్పీన్స్ వలస కార్మికుల విభాగం (DMW) అధికారి-ఇన్-ఛార్జ్ (OIC) హన్స్ లియో కాక్డాక్ మాట్లాడుతూ..  వరదల సమయంలో ముగ్గురు  ఫిలిపినో కార్మికులు మరణించారని తెలిపారు  ఇద్దరు OFW లు వరద సమయంలో వారి వాహనం లోపల ఊపిరాడక మరణించగా.. మరొక OFW వాహన ప్రమాదం కారణంగా మరణించాడని పేర్కొన్నారు. వరదలతో ప్రభావితమైన ఫిలిప్పినోలకు సహాయం అందించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని దుబాయ్‌లోని ఫిలిప్పీన్స్ కాన్సులేట్ జనరల్ (పిసిజి) తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com