వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- April 20, 2024
యూఏఈ: వర్షాలు నేపథ్యంలో నిలిచిపోయిన నీటికి సంబంధించిన వ్యాధులు, ఇన్ఫెక్షన్ల కోసం వచ్చే రోగుల సంఖ్య పెరుగుతున్నట్లు యూఏఈలోని వైద్యులు, ఆసుపత్రులు చెబుతున్నాయి. కాగా డెంగ్యూ అనేది దోమల మరియు ఈగల ద్వారా సంక్రమించే వ్యాధులు. ముంపు ప్రాంతాలలో నివసించే వారు ఇప్పటికే జ్వరం, అతిసారం మరియు విరేచనాలతో బాధపడుతున్న రోగుల పెరుగుదలను చూస్తున్నామన, ఈ కేసులు మరింత పెరుగుతాయని తాము అంచనా వేస్తున్నట్ల.. దీనితో పాటు న్యుమోనియా మరియు వైరల్ బ్రోన్కైటిస్ కేసులలో గణనీయమైన పెరుగుదల ఉందని జెబెల్ అలీలోని ఆస్టర్ సెడార్స్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ మెడిసిన్ జనరల్ ప్రాక్టీషనర్ డాక్టర్ అమల్ అబ్దుల్కాడర్ తెలిపారు.
వరదలు మురుగునీరు మరియు గృహ తాగునీరు కలుషితం అయ్యే అవకాశం ఉందని ఇన్ఫెక్షన్ నియంత్రణ నిపుణుడు తెలిపారు. ఈ కలుషిత నీరు అతిసారం, విరేచనాలు, గ్యాస్ట్రోఎంటెరిటిస్, అమీబియాసిస్, హెపటైటిస్, టైఫాయిడ్ మరియు క్యాంపిలోబాక్టీరియోసిస్ వంటి వ్యాధులకు అధిక ప్రమాదాన్ని కలిగిస్తుందని తెలిపారు. వ్యక్తులు కలుషితమైన నీటిని తాగడం వల్ల ఈ వ్యాధులు వస్తాయని తుంబే యూనివర్సిటీ హాస్పిటల్కు చెందిన డాక్టర్ ఫియాజ్ అహమ్మద్ చెప్పారు.
వరద నీటి లో నానిన వాటిని ఉపయోగించే ముందు అన్ని నానబెట్టిన దుప్పట్లు, తివాచీలు మరియు కర్టెన్లను మంచి సూర్యకాంతిలో ఆరబెట్టాలని, తేమ ఉంటే బాక్టీరియా వృద్ధి చెంది, ఇది శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుందని డాక్టర్ అబ్దుల్కాడర్ వివరించారు. అదే విధంగా అన్ని కూరగాయలు మరియు పండ్లను తినడానికి ముందు వాటిని శుభ్రమైన నీటిలో బాగా కడగడం చాలా అవసరమని డాక్టర్ ఫియాజ్ చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









