తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- April 24, 2024
తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 కోటా) టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. తిరుమల, తిరుపతిలో గదుల కోటా టికెట్ల(జులై నెల)ను నేడు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే శ్రీవారి సేవ కోటా టికెట్లను 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ టికెట్లను మ.12 గంటలకు, పరకామణి సేవ కోటాను మ. ఒంటి గంటకు విడుదల చేయనుంది. ప్రతినెలా శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లను మూడు నెలల ముందుగానే టీటీడీ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో జులై నెలకు సంబంధించిన షెడ్యూల్ను టీటీడీ ఇటీవలే ప్రకటించింది. జులై నెలకు సంబంధించిన.. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన లాంటి ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీడిప్ కోసం.. ఏప్రిల్ 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. కాలినడకన వెళ్లలేని వారు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది. చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్నవారికి ఈ అవకాశం ఎంతో మేలు చేస్తుంది. మీరు టికెట్లు బుకు చేసుకోవాలని అనుకుంటే.. https://tirupatibalaji.ap.gov.inవెబ్సైట్కు వెళ్లండి. ఇందులో ప్రత్యేక దర్శన టికెట్లతో పాటు మరిన్ని సేవలూ బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- డోనాల్డ్ ట్రంప్ కొత్త స్కీమ్..
- జల వివాదాల పై రాష్ట్రాలకు ప్రధాని మోదీ కీలక సూచన
- ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’తో రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధం బలోపేతం: గవర్నర్ శుక్లా
- గోదావరి-కావేరి అనుసంధానం పై కేంద్రం యోచన: సీఎం చంద్రబాబు
- ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి: సీఎం రేవంత్
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!









