కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!

- April 25, 2024 , by Maagulf
కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!

యూఏఈ: యూఏఈ-ఒమన్ మధ్య రైళ్లలో ప్రయాణీంచే రోజులు త్వరలో రానున్నాయి. ఈ మేరకు ఒక ఉన్నత అధికారి వెల్లడించారు. మెగా ప్రాజెక్ట్ ను హఫీత్ రైల్ గా పిలవనున్నారు.  రెండు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయని హఫీత్ రైల్ సిఇఒ అహ్మద్ అల్ ముసావా అల్ హషేమీ తెలిపారు.  గతంలో 'ఒమన్ -ఎతిహాద్ రైల్ కంపెనీ'గా పిలువబడే హఫీత్ రైల్ రైల్వేను నడుపుతున్న జాయింట్ వెంచర్ కంపెనీ కొత్త బ్రాండ్ గుర్తింపును తాజాగా ఆవిష్కరించింది. కొత్త బ్రాండ్ రైల్వే లైన్ అబుదాబి అల్ వత్బా ప్రాంతం నుండి ఒమానీ నగరం, సోహార్ ఓడరేవు వరకు కొనసాగనుంది. రైళ్లు ఎడారి నుండి పర్వతాలు, లోయ ప్రాంతాల వరకు విభిన్న భౌగోళిక ప్రాంతాల గుండా ప్రయాణీకులను తీసుకువెళతాయి.  అబుదాబిలో జాయింట్ యూఏఈ-ఒమన్ బిజినెస్ ఫోరమ్ సందర్భంగా అల్ హషేమీ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ అనేక ఆర్థిక , సామాజిక ప్రయోజనాలను అందిస్తుందని అన్నారు. "యూఏఈ-ఒమన్ రైల్వే ప్రాజెక్ట్ వివిధ ఆర్థిక, పారిశ్రామిక రంగాలలో మరింత సహకారానికి ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుందని అల్ హషేమీ అన్నారు.  ఇది పర్యాటకం,  ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచే రెండు దేశాల మధ్య ప్రయాణీకుల రాకపోకలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com