యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!

- April 27, 2024 , by Maagulf
యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!

యూఏఈ: దేశంలోని ఒమన్ పౌరుల ట్రాఫిక్ ఉల్లంఘనలను రద్దు చేయాలని యూఏఈ ప్రభుత్వం నిర్ణయించింది.  2018 నుండి 2023 వరకు జరిగిన అన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలకు వర్తిస్తుందని వెల్లడించింది.  ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ సోమవారం యూఏఈ పర్యటన సందర్భంగా ఈ ప్రకటన చేశారు.  ఎమిరేట్‌లోని ఒమానీ పౌరులకు జరిమానా రద్దును తక్షణమే అమలు చేస్తున్నట్లు అబుదాబి పోలీసులు ప్రకటించారు. అబుదాబి పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్, మేజర్ జనరల్ పైలట్ ఫారిస్ ఖలాఫ్ అల్ మజ్రోయి మాట్లాడుతూ.. ఒమన్ పౌరులు చేసే అన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలను రద్దు చేయాలనే నిర్ణయాన్ని వెంటనే అమలు చేయనున్నట్లు ప్రకటించారు.       

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com