కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- April 27, 2024దుబాయ్: కొన్ని నీటి కాలువల్లో చనిపోయిన చేపలు కనిపించడంపై.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై దుబాయ్ మున్సిపాలిటీ స్పందించింది. కుండపోత వర్షం, వరదల తర్వాత నీటి కాలువల్లో చనిపోయిన చేపలు కనిపించడం సహజమైన విషయమని దుబాయ్ మునిసిపాలిటీ (డీఎం) స్పష్టం చేసింది. ఎమిరేట్లోని ఫుట్ పాత్, వాటర్ చానల్స్ లలో చనిపోయిన చేపలు ఉన్నాయని అనేక మీడియా మరియు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. తరచుగా వాతావరణ పరిస్థితులలో మార్పుల వల్ల ఇలా అవుతుందని తెలిపారు. అధిక వర్షపాతం పెరగడం లేదా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వంటివి వీటికి కారణం అని ఒక ప్రతినిధి చెప్పారు. పరిస్థితిని నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలు ప్రస్తుతం పనిచేస్తున్నాయని తెలిపారు. యూఏఈ లో ఏప్రిల్ 16న అత్యధిక వర్షపాతం నమోదైంది. అధికారుల ప్రకారం.. దుబాయ్లో 24 గంటల కంటే తక్కువ సమయంలో 220 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
తాజా వార్తలు
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు