కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- April 27, 2024
దుబాయ్: కొన్ని నీటి కాలువల్లో చనిపోయిన చేపలు కనిపించడంపై.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై దుబాయ్ మున్సిపాలిటీ స్పందించింది. కుండపోత వర్షం, వరదల తర్వాత నీటి కాలువల్లో చనిపోయిన చేపలు కనిపించడం సహజమైన విషయమని దుబాయ్ మునిసిపాలిటీ (డీఎం) స్పష్టం చేసింది. ఎమిరేట్లోని ఫుట్ పాత్, వాటర్ చానల్స్ లలో చనిపోయిన చేపలు ఉన్నాయని అనేక మీడియా మరియు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. తరచుగా వాతావరణ పరిస్థితులలో మార్పుల వల్ల ఇలా అవుతుందని తెలిపారు. అధిక వర్షపాతం పెరగడం లేదా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వంటివి వీటికి కారణం అని ఒక ప్రతినిధి చెప్పారు. పరిస్థితిని నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలు ప్రస్తుతం పనిచేస్తున్నాయని తెలిపారు. యూఏఈ లో ఏప్రిల్ 16న అత్యధిక వర్షపాతం నమోదైంది. అధికారుల ప్రకారం.. దుబాయ్లో 24 గంటల కంటే తక్కువ సమయంలో 220 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







