స్పాట్ అడ్మిషన్ పేరిట నమ్మించి మోసం ..
- June 07, 2016
స్పాట్ అడ్మిషన్ పేరిట నమ్మించి తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించారు. అర్హతలు, నిబంధనల గురించి పూర్తి వివరాలు చెప్పకుండా అడ్మిషన్లు కల్పించి డబ్బులు తీసుకున్నారు. తీరా తొలి సెమిస్టర్ పూర్తి కావడానికి సమయంలో దగ్గరపడుతున్న సమయంలో అర్హతలు లేవంటూ విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించారు.
డబ్బులు, సమయం వృధా కావడంతో దిక్కు తోచని పరిస్థితిలో భారత విద్యార్థులు పడ్డారు. నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా అర్హతలు లేవనే కారణంతో వెస్టర్న్ కెంటకీ యూనివర్సిటీ కొందరు విద్యార్థులను బహిష్కరించింది.వీరిలో కొందరికి ఇక్కడే తగిన కోర్సులో చేరేందుకు లేదా ఏదైనా వర్సిటీలో అడ్మిషన్కు సాయపడతామని సూచించింది.స్వదేశానికి వెళ్లిపోవాల్సిందేనని 25 మంది భారత విద్యార్థులకు సూచించింది. ఈ ఏడాది జనవరిలో కెంటకీ వర్సిటీ అంతర్జాతీయ ఏజెన్సీలద్వారా భారతలో అడ్మిషన్ల కార్యక్రమం నిర్వహించింది. ఈ ఏడాది జనవరిలో 60 మంది కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్లో చేరేందుకు పేర్లు నమో దు చేసుకున్నారు.మొదటి సెమిస్టర్పూర్తి కావస్తుండగా వారి లో 40 మంది అర్హులు కారని తేలినట్లు వర్సిటీ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ చైర్మన్ జేమ్స్ గ్యారీ తెలిపారు. సామర్థ్యం సాధించకుండా వీరు బయటకు వెళితే తమ వర్సిటీ పేరు పోతుందని, అందుకే బహిష్కరించామని చెప్పారు. కాగా, భారత ప్రధాని అమెరికాలో ఉండగానే ఈ పరిణామం చోటు చేసుకుంది.విద్యార్థులను వెళ్లిపోవాలని యూనివర్శిటీ చెప్పడం పట్ల వెస్టర్న్ కెంటకీ విశ్వవిద్యాలయం భారత విద్యార్థుల సంఘం చైర్మన్ ఆదిత్య శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వారింత దూరం వచ్చి డబ్బులు పెట్టారని, వారి పట్ల ఇలా జరగడం సరి కాదని ఆయన అన్నారు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







