పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్

- May 01, 2024 , by Maagulf
పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్

దుబాయ్: ప్రయాణీకుల భద్రత కోసం దుబాయ్ మెట్రో స్టేషన్లలో కొత్త రోజువారీ ప్రోటోకాల్‌లను అమలు చేస్తున్నట్లు రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA)  ప్రకటించింది. రద్దీ సమయాల్లో 'క్రూడ్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్స్' అమలులో ఉంటాయని RTA తెలిపింది. ఉదయం 7 నుండి 9.30 వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 వరకు ఉంటాయి కాబట్టి దుబాయ్ మెట్రో రైడర్లు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని కోరారు. 

ఏప్రిల్ 16న భారీ వర్షం తర్వాత దుబాయ్ మెట్రో ఇంకా పూర్తి కార్యకలాపాలకు తిరిగి రాలేదు. నాలుగు స్టేషన్‌లు( ఆన్‌పాసివ్, ఈక్విటీ, అల్ మష్రెక్ మరియు ఎనర్జీ) ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు.  ప్రయాణికులు పీక్ అవర్స్‌లో మెట్రోను ఉపయోగించవద్దని, ప్రస్తుతం పనిచేస్తున్న స్టేషన్‌ల ప్రకారం వారి ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని RTA సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com