‘కృష్ణమ్మ’ ట్రైలర్ వచ్చేసింది..
- May 02, 2024
హైదరాబాద్: జూనియర్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగి ప్రస్తుతం విలన్గా, హీరోగా వరుస సినిమాలను చేస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఆయన నటిస్తున్న చిత్రం కృష్ణమ్మ. అథిరా రాజ్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి వివి గోపాల కృష్ణ దర్శకుడు. కాలభైరవ సంగీతాన్ని అందిస్తుండగా, అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ట్రైలర్ను విడుదల చేసింది. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఓ కేసులో సత్యదేవ్ను ఇరికించినట్లుగా ట్రైలర్ను చూస్తుంటే అర్థమవుతోంది. దాన్ని నుంచి అతడు ఎలా బయటపడ్డాడు. అసలు ఆ కేసు ఏంటి ? అతడినే ఎందుకు ఇరికించారు అని తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
“కథ నడకకైనా, నది నడకకైనా మలుపులే అందం. కానీ కొన్ని మలుపుల్లో సుడులు ఉంటామ్.”.. ‘ఇన్నాళ్లు ఎప్పుడు పుట్టాము, ఎవరికి పుట్టామో తెలియక పోవడమే బాధ అని అనుకున్నాను.. కానీ..ఎందుకు చనిపోతున్నామో, ఎవడి చేతుల్లో చనిపోతున్నామో అసలైన భాద’ అంటూ సత్యదేవ్ చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
తాజా వార్తలు
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ భారీ సాయం
- ఒమన్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 3,000 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు స్వాధీనం
- ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతి ఇవటూరికు ఘన సత్కారం
- కీవ్లోని ఆర్మీ వెపన్స్ డిపో పై రష్యా భీకర దాడి !!
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య







